ప్రజావాణికి 63 దరఖాస్తులు

On
ప్రజావాణికి 63 దరఖాస్తులు

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 21, న్యూస్ ఇండియా : జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) చంద్రశేఖర్  సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి 63  మంది దరఖాస్తుదారులు  తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించారు. రెవెన్యూ శాఖ 35 , పౌరసరఫరాల శాఖ 02, సర్వే ల్యాండ్ 4, పంచాయతీ & పి టి విభాగం 3, పంచాయతీరాజ్ 2, డి.ఆర్.డి.ఓ 4, మున్సిపల్ 3, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 3, వ్యవసాయ శాఖ 4, పశు సంవర్ధక శాఖ 3,  వచ్చాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ… ప్రతి అర్జీపై తక్షణ చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రజల ప్రధాన సమస్యలపై పూర్తి దృష్టి పెట్టి, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  డీ.ఆర్‌.ఓ పద్మజ రాణి, ఏవో అంటోని సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-21 at 4.01.40 PM

Views: 3
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'