చిన్నారులకు ఆధార్ అప్డేట్ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా నరేష్):జిల్లాలో 0-5 సంవత్సరాలలోపు వయసు గల పిల్లల ఆధార్ నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం ఐడిఒసి కార్యాలయం సమావేశ మందిరంలో విద్య,గ్రామీణాభివృద్ధి, బ్యాంకు, పంచాయతీ, తపాలా,మున్సిపల్ మరియు రెవెన్యూ శాఖల అధికారులతో జిల్లా స్థాయి ఆధార్ మాని టరింగ్ కమిటీ సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ జిల్లాలోని 5 సంవత్సరాలలోపు గల పిల్లలందరి ఆధార్ నమోదు చేయిం చాలని తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఆధార్ నమోదు కేంద్రాలు పని చేయాలని, 5 సంవత్సరాలు, 15 సంవ త్సరాలు దాటిన వారు ఆధార్ బయో మెట్రిక్ చేయించుకోవాలని తెలిపారు. ఆధార్ లేని వారిని గుర్తించి నమోదు చేయించాలని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పౌర సేవలు పొందాలంటే ఆధార్ అప్ డేట్ తప్పని సరి అని అన్నారు. ఉద్యోగాల దరఖాస్తులు, బ్యాంకు ఖాతాలు, ధ్రువపత్రాలు, పొందేందుకు, స్థలాల రిజిస్ట్రేషన్, సిమ్ కార్డులు పొందాలంటే ఆధార్ అప్ డేట్ చేసుకోవాలని సూచించారు.పదేళ్ల క్రితం ఆధార్ పొందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నవీకరించుకోవాలని సూచించారు. ఆధార్ ఆధారంగా కొనసాగుతున్న సేవలను భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్డు వివరాలు పునరుద్ధరించుకోవాలని పేర్కొన్కారు.అంగన్ వాడీ కేంద్రాలు,హాస్పిటల్, పాఠశాలల్లో ఆధార్ ప్రక్రియ చేపట్టి వంద శాతం పూర్తి చేసేలా చూడాలని, విద్యా సంస్థలతో సమన్వయం చేసుకొని పూర్తి చేయాలని సూచించారు. అప్ డేట్ ప్రక్రియ సంబంధించిన ఆధార్ సేవా కేంద్రాలకు తగిన సూచనలు చేయాలని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆదేశించారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1947, HELP@uidai.net.in ను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆధార్ నమోదు కేంద్రాలు, ఆధార్ కార్డులపై అభ్యంతరాలు ఉంటే కలెక్టరేట్ భవనంలోని ఈ- డిస్ట్రిక్ మేనే జర్ సైదేశ్వరరావు ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రీజి యన్ యుఐడి అసిస్టెంట్ మేనేజర్ మొహ్మద్ సౌభన్, కొత్తగూడెం ఆర్టిఓ మధు, డిప్యూటీ జెడ్ పి సీఈవో చంద్రశేఖర్, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత, ఎల్డిఎం రామ్ రెడ్డి, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి,నీలయ్య సెర్ప్ అడిషనల్ డి ఆర్ డిఒ రఘు కుమార్ జిల్లా మీసేవ మేనేజర్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comment List