సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ 

కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్

On
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ 

ఈ నెల మూడవ తేదీన చంద్రుగొండ మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు వారు ట్రాఫిక్ నియంత్రణ చర్యలను చేపట్టడం జరుగుతుందని కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. విఎం బంజర నుండి చంద్రుగొండ మీదుగా కొత్తగూడెం వైపు వచ్చే వాహనాలు కల్లూరు,తల్లాడ,ఏన్కూరు మరియు జూలూరుపాడు మీదుగా కొత్తగూడెం చేరుకోవాలి.అదే విధంగా కొత్తగూడెం నుండి విఎం బంజర వైపు ప్రయాణించే వాహనదారులు జూలూరుపాడు,ఏన్కూరు,తల్లాడ మరియు కల్లూరు మీదుగా విఎం బంజర వైపు ప్రయాణించాలని కోరారు.ఈ ట్రాఫిక్ డైవర్షన్ మూడవ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు.ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వాహనదారుల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు,ఆటంకాలు తలెత్తకుండా,ట్రాఫిక్లో చిక్కుకోకుండా పోలీసు వారు చేపట్టే ట్రాఫిక్ డైవర్షన్ ను గమనించి ప్రజలు సహకరించాలని డిఎస్పీ ఈ సందర్బంగా కోరారు.

Views: 203
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

గణపతి నిమర్జనం ఘాటును పరిశీలించిన జిల్లా ఎస్పీ గణపతి నిమర్జనం ఘాటును పరిశీలించిన జిల్లా ఎస్పీ
బ్రేకింగ్:- మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు పట్టణం :- మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు గణపతి నిమర్జనం స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రామ్నాథ్...
పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో వినాయక ఉత్సవాల్లో భాగంగా ఘనంగా కుంకుమార్చన
500 పడకల ఆసుపత్రి ‘నూతన భవనం’ ప్రారంభం..
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
గణనాథునికి 108 రకాల నైవేద్యం!
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ 
యూరియా కోసం రైతులు కష్టాలు పట్టించుకొని అధికారులు