బండి యాత్ర షురూ!

On

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను హైకోర్టు ఇచ్చిన షరతులకు లోబడి ప్రారంభించారు. నిన్న కరీంనగర్‌ నుంచి నిర్మల్‌కు చేరుకున్న బండి సంజయ్‌.. సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో నయా జోష్‌ నెలకొంది. మరోవైపు భైంసా శివారులో నేడు బీజేపీ బహిరంగ సభ జరగనుంది. నిర్మల్ నేషనల్ హైవే పక్కన ఉన్న […]

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను హైకోర్టు ఇచ్చిన షరతులకు లోబడి ప్రారంభించారు.

నిన్న కరీంనగర్‌ నుంచి నిర్మల్‌కు చేరుకున్న బండి సంజయ్‌.. సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించారు.

దీంతో బీజేపీ శ్రేణుల్లో నయా జోష్‌ నెలకొంది. మరోవైపు భైంసా శివారులో నేడు బీజేపీ బహిరంగ సభ జరగనుంది. నిర్మల్ నేషనల్ హైవే పక్కన ఉన్న గణేశ్ ఇండస్ట్రీ ప్రాంగణంలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు బీజేపీ భారీ బహిరంగ సభ ఉండటంతో నిర్మల్ జిల్లా భైంసాలో 144 సెక్షన్ అమల్లో ఉంది.

Read More గ్రీన్‌కార్డ్ హోల్డర్లు నేరాలు చేస్తే దేశ బహిష్కరణే.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు

నిన్న అమల్లోకి తెచ్చిన ఈ సెక్షన్‌ను ఇవాళ కూడా అమల్లో ఉంచుతున్నారు.

Read More ఉప్పు, కారం, నూనె, పప్పులు.. ధరలు పెరుగుతాయా? ఆర్బీఐ తాజా రిపోర్ట్‌లో ఏముంది?

ఈ కారణంగా భైంసాలో భారీగా పోలీసులు మోహరించారు. అయితే 144 సెక్షన్‌పై పోలీసులు అధికారిక ప్రకటన చెయ్యలేదు.

Read More ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ 69 అడుగులు.. పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో దర్శనం!

ఇవాళ బహిరంగ సభ జరగనుండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

అయితే ఇది సిటీకి శివారులో జరుగుతోంది కాబట్టి.. శాంతి భద్రతలకు ఎలాంటి సమస్యా ఉండదని పోలీసులు అంటున్నారు.

Views: 5
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఏపీ Future Ready Ecosystem అంటే ఏమిటి? అమరావతి నుంచి విశాఖ వరకు భారీ డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్! ఏపీ Future Ready Ecosystem అంటే ఏమిటి? అమరావతి నుంచి విశాఖ వరకు భారీ డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి, విశాఖపట్నం, భోగాపురం, కాకినాడ, రామాయపట్నం, శ్రీ సిటీ వంటి ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ పరిశ్రమలపై దృష్టి పెట్టిన భారీ అభివృద్ధి ప్రణాళికను అమలు...
హోమ్ లోన్‌లో ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ తెలుసా? ఇలా చేస్తే లక్షల్లో వడ్డీ ఆదా చేసే ఛాన్స్!
5 వేల జీతం నుంచి ₹45 లక్షల ప్యాకేజీ.. బెంగళూరు టెక్కీ సక్సెస్ స్టోరీలో అసలు ట్విస్ట్ ఇదే!
ఆపరేషన్ ముస్కాన్ పోస్టర్లను ఆవిష్కరించిన : ఎస్పీ 
చైనాలో గోల్డ్ ట్రేడింగ్‌కు బ్రేక్.. ప్రపంచ బంగారం మార్కెట్‌లో అలజడి.. అసలు ఏం జరుగుతోంది?
ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ 69 అడుగులు.. పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో దర్శనం!
ఉప్పు, కారం, నూనె, పప్పులు.. ధరలు పెరుగుతాయా? ఆర్బీఐ తాజా రిపోర్ట్‌లో ఏముంది?