నేడు ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు

On

బండి సంజయ్‌ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. కరీంనగర్‌ దగ్గర పాదయాత్రకు ఫుల్‌స్టాప్‌ పడబోతోంది. బైంసా నుంచి కరీంనగర్‌ వరకు సాగిన ఐదో విడత యాత్రలో సంచలనాలకు తెరలేపారు బండి సంజయ్‌. ఆటంకాలు-ఆంక్షలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతి సవాళ్ల మధ్య.. బండి సంజయ్‌ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర సాగింది. పోలీస్‌ కేసులు, కోర్టు చిక్కులు దాటుకుని పాదయాత్ర కొనసాగించారు తెలంగాణ బీజేపీ రథసారథి బండి సంజయ్‌. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజాసమస్యలను తెలుసుకుంటూ […]

బండి సంజయ్‌ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. కరీంనగర్‌ దగ్గర పాదయాత్రకు ఫుల్‌స్టాప్‌ పడబోతోంది.

బైంసా నుంచి కరీంనగర్‌ వరకు సాగిన ఐదో విడత యాత్రలో సంచలనాలకు తెరలేపారు బండి సంజయ్‌. ఆటంకాలు-ఆంక్షలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతి సవాళ్ల మధ్య.. బండి సంజయ్‌ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర సాగింది.

పోలీస్‌ కేసులు, కోర్టు చిక్కులు దాటుకుని పాదయాత్ర కొనసాగించారు తెలంగాణ బీజేపీ రథసారథి బండి సంజయ్‌.

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజాసమస్యలను తెలుసుకుంటూ మధోల్‌, నిర్మల్‌, ఖానాపూర్‌, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్‌ నియోజకవర్గాల మీదుగా సాగింది యాత్ర.

Read More మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.

ఐదో విడత టూర్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై బండి చేసిన హాట్‌ కామెంట్స్‌ పొలిటికల్‌గా హీట్‌ పుట్టించాయ్. నిర్మల్‌ వేదికగా బండి-ఇంద్రకరణ్‌ మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు నడిచాయ్. ఎమ్మెల్సీ కవితపైనా హాట్‌ కామెంట్స్‌ చేశారు బండి సంజయ్‌. దాంతో, ఇరువురి మధ్యా డైలాగ్ వార్‌ నడిచింది.

Read More అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.

ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకాబోతున్నారు.

Read More ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' ప్రారంభం.

పలువురు ముఖ్యనేతలు నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు.

కరీంనగర్‌ సభ తర్వాత టీబీజేపీ నేతలతో సమావేశం కానున్నారు జేపీ నడ్డా. భవిష్యత్‌ కార్యాచరణ, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై దిశానిర్దేశం చేయనున్నారు.

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.