గడ్డి మందు పిచికారి చేయడంతో ధ్వంసమైన పత్తి పంట

On
గడ్డి మందు పిచికారి చేయడంతో ధ్వంసమైన పత్తి పంట

 

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామంలో పత్తి చేనుపై గడ్డి మందును పిచికారి చేయడం వల్ల 13 ఎకరాల పత్తి చేను మొత్తం ధ్వంసం కావడం జరిగింది. పులిగిల్ల గ్రామానికి చెందిన మంద బిక్షపతి, వేముల మధు, బుగ్గ మల్లయ్య లు ముగ్గురు  కలిసి ఒక వ్యక్తి వద్ద104 సర్వే నెంబర్ లోని 13 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని పత్తి చేను వేయడం జరిగింది. భూమిని లీజుకు ఇచ్చిన వ్యక్తికి వాళ్ళ అన్న పైళ్ళ పురుషోత్తం రెడ్డి కి మనస్పర్ధలు ఉండడంతో వారిరువురి పగతో వీళ్ళ యొక్క పత్తి చేనుమీద రాత్రికి రాత్రే డ్రోన్ సహాయంతో గడ్డి మందు పిచికారి చేయడంతో 13 ఎకరాల పత్తి చేను మొత్తం మాడిపోయిందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాధితులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని నష్టపరిహారం చేకూర్చాలని మీడియాతో వాపోయారు.

Views: 473
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత