మహారాష్ట్ర వాసిని ఆదుకున్న సురక్ష సేవా సంఘం..

పది రోజులుగా రక్తదాతల కొరకు ఎదురుచూపు..

On
మహారాష్ట్ర వాసిని ఆదుకున్న సురక్ష సేవా సంఘం..

సురక్ష సేవా సంఘం చోర్వతో ఆపరేషన్ విజయవంతం.

IMG-20230927-WA1457
సురక్ష సేవా సంఘం తెలంగాణ అధ్యక్షులు కిక్కర గోపి శంకర్ యాదవ్

గుండెకు రంధ్రం పడి విషమ పరిస్థితుల్లో ఉన్న హృద్రోగి కి రక్తదానం చేసిన సురక్ష సేవా సంఘం తెలంగాణ అధ్యక్షులు కిక్కర గోపి శంకర్ యాదవ్ ఆసరాగా నిలిచారు. లతా వాల్కే మహారాష్ట్రకు చెందిన రాజ్ పూర్ వాసి ఒక హాస్పటల్లో ఆయా గా పనిచేస్తుంది. చాలా పేద కుటుంబం తన చిన్న కుమారుడు సంచిత్ విజయ్(21) కు ఈ మధ్యకాలంలో గుండెకు రంధ్రం పడి పరిస్థితి విషమంగా మారింది. దీనికి సంబంధించిన వైద్యం హైదరాబాదులో ఉందని తెలుసుకుని హైదరాబాద్ కు రావడం జరిగింది. ఆపరేషన్ అవసరం ఉండగా గత పది రోజులుగా ఎంతో మందిని రక్తం కోసం అభ్యర్థన చేయడం జరిగింది, కానీ ఫలితం లేదు. చివరికి తెలిసిన వ్యక్తుల ద్వారా సురక్ష సేవా సంఘం దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన సురక్ష సేవా సంఘం రక్తదాతలను ఏర్పాటు చేసి సరైన సమయంలో రక్తదానం చేసి సంచిత్ గుండె ఆపరేషన్ విజయవంతం అవడంలో భాగస్వాములు అయ్యారు. తన కుమారుడి గుండె ఆపరేషన్ కి సకాలంలో రక్తదానం చేసి సహకరించిన సురక్ష సేవా సంఘం సభ్యులకు సంచిత్ తల్లి లత ధన్యవాదాలు తెలియజేశారు.

Views: 19
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. రెండు లారీలు పట్టించిన పెద్ద అంబర్‌పేట్ అసోసియేషన్, ఆటోనగర్ జేఏసీ.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, ఆగస్టు 6, న్యూస్ ఇండియా...
ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు
అమరవీరులు దస్తాగిరి, రాంచందర్ త్యాగం చిరస్మరణం   
విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం