మహారాష్ట్ర వాసిని ఆదుకున్న సురక్ష సేవా సంఘం..

పది రోజులుగా రక్తదాతల కొరకు ఎదురుచూపు..

On
మహారాష్ట్ర వాసిని ఆదుకున్న సురక్ష సేవా సంఘం..

సురక్ష సేవా సంఘం చోర్వతో ఆపరేషన్ విజయవంతం.

IMG-20230927-WA1457
సురక్ష సేవా సంఘం తెలంగాణ అధ్యక్షులు కిక్కర గోపి శంకర్ యాదవ్

గుండెకు రంధ్రం పడి విషమ పరిస్థితుల్లో ఉన్న హృద్రోగి కి రక్తదానం చేసిన సురక్ష సేవా సంఘం తెలంగాణ అధ్యక్షులు కిక్కర గోపి శంకర్ యాదవ్ ఆసరాగా నిలిచారు. లతా వాల్కే మహారాష్ట్రకు చెందిన రాజ్ పూర్ వాసి ఒక హాస్పటల్లో ఆయా గా పనిచేస్తుంది. చాలా పేద కుటుంబం తన చిన్న కుమారుడు సంచిత్ విజయ్(21) కు ఈ మధ్యకాలంలో గుండెకు రంధ్రం పడి పరిస్థితి విషమంగా మారింది. దీనికి సంబంధించిన వైద్యం హైదరాబాదులో ఉందని తెలుసుకుని హైదరాబాద్ కు రావడం జరిగింది. ఆపరేషన్ అవసరం ఉండగా గత పది రోజులుగా ఎంతో మందిని రక్తం కోసం అభ్యర్థన చేయడం జరిగింది, కానీ ఫలితం లేదు. చివరికి తెలిసిన వ్యక్తుల ద్వారా సురక్ష సేవా సంఘం దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన సురక్ష సేవా సంఘం రక్తదాతలను ఏర్పాటు చేసి సరైన సమయంలో రక్తదానం చేసి సంచిత్ గుండె ఆపరేషన్ విజయవంతం అవడంలో భాగస్వాములు అయ్యారు. తన కుమారుడి గుండె ఆపరేషన్ కి సకాలంలో రక్తదానం చేసి సహకరించిన సురక్ష సేవా సంఘం సభ్యులకు సంచిత్ తల్లి లత ధన్యవాదాలు తెలియజేశారు.

Views: 18
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్ ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం