మహారాష్ట్ర వాసిని ఆదుకున్న సురక్ష సేవా సంఘం..

పది రోజులుగా రక్తదాతల కొరకు ఎదురుచూపు..

On
మహారాష్ట్ర వాసిని ఆదుకున్న సురక్ష సేవా సంఘం..

సురక్ష సేవా సంఘం చోర్వతో ఆపరేషన్ విజయవంతం.

IMG-20230927-WA1457
సురక్ష సేవా సంఘం తెలంగాణ అధ్యక్షులు కిక్కర గోపి శంకర్ యాదవ్

గుండెకు రంధ్రం పడి విషమ పరిస్థితుల్లో ఉన్న హృద్రోగి కి రక్తదానం చేసిన సురక్ష సేవా సంఘం తెలంగాణ అధ్యక్షులు కిక్కర గోపి శంకర్ యాదవ్ ఆసరాగా నిలిచారు. లతా వాల్కే మహారాష్ట్రకు చెందిన రాజ్ పూర్ వాసి ఒక హాస్పటల్లో ఆయా గా పనిచేస్తుంది. చాలా పేద కుటుంబం తన చిన్న కుమారుడు సంచిత్ విజయ్(21) కు ఈ మధ్యకాలంలో గుండెకు రంధ్రం పడి పరిస్థితి విషమంగా మారింది. దీనికి సంబంధించిన వైద్యం హైదరాబాదులో ఉందని తెలుసుకుని హైదరాబాద్ కు రావడం జరిగింది. ఆపరేషన్ అవసరం ఉండగా గత పది రోజులుగా ఎంతో మందిని రక్తం కోసం అభ్యర్థన చేయడం జరిగింది, కానీ ఫలితం లేదు. చివరికి తెలిసిన వ్యక్తుల ద్వారా సురక్ష సేవా సంఘం దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన సురక్ష సేవా సంఘం రక్తదాతలను ఏర్పాటు చేసి సరైన సమయంలో రక్తదానం చేసి సంచిత్ గుండె ఆపరేషన్ విజయవంతం అవడంలో భాగస్వాములు అయ్యారు. తన కుమారుడి గుండె ఆపరేషన్ కి సకాలంలో రక్తదానం చేసి సహకరించిన సురక్ష సేవా సంఘం సభ్యులకు సంచిత్ తల్లి లత ధన్యవాదాలు తెలియజేశారు.

Views: 18
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*