మహారాష్ట్ర వాసిని ఆదుకున్న సురక్ష సేవా సంఘం..

పది రోజులుగా రక్తదాతల కొరకు ఎదురుచూపు..

On
మహారాష్ట్ర వాసిని ఆదుకున్న సురక్ష సేవా సంఘం..

సురక్ష సేవా సంఘం చోర్వతో ఆపరేషన్ విజయవంతం.

IMG-20230927-WA1457
సురక్ష సేవా సంఘం తెలంగాణ అధ్యక్షులు కిక్కర గోపి శంకర్ యాదవ్

గుండెకు రంధ్రం పడి విషమ పరిస్థితుల్లో ఉన్న హృద్రోగి కి రక్తదానం చేసిన సురక్ష సేవా సంఘం తెలంగాణ అధ్యక్షులు కిక్కర గోపి శంకర్ యాదవ్ ఆసరాగా నిలిచారు. లతా వాల్కే మహారాష్ట్రకు చెందిన రాజ్ పూర్ వాసి ఒక హాస్పటల్లో ఆయా గా పనిచేస్తుంది. చాలా పేద కుటుంబం తన చిన్న కుమారుడు సంచిత్ విజయ్(21) కు ఈ మధ్యకాలంలో గుండెకు రంధ్రం పడి పరిస్థితి విషమంగా మారింది. దీనికి సంబంధించిన వైద్యం హైదరాబాదులో ఉందని తెలుసుకుని హైదరాబాద్ కు రావడం జరిగింది. ఆపరేషన్ అవసరం ఉండగా గత పది రోజులుగా ఎంతో మందిని రక్తం కోసం అభ్యర్థన చేయడం జరిగింది, కానీ ఫలితం లేదు. చివరికి తెలిసిన వ్యక్తుల ద్వారా సురక్ష సేవా సంఘం దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన సురక్ష సేవా సంఘం రక్తదాతలను ఏర్పాటు చేసి సరైన సమయంలో రక్తదానం చేసి సంచిత్ గుండె ఆపరేషన్ విజయవంతం అవడంలో భాగస్వాములు అయ్యారు. తన కుమారుడి గుండె ఆపరేషన్ కి సకాలంలో రక్తదానం చేసి సహకరించిన సురక్ష సేవా సంఘం సభ్యులకు సంచిత్ తల్లి లత ధన్యవాదాలు తెలియజేశారు.

Views: 18
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'