త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం 

ప్రతి ఒక్కరు  చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

On
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం 

త్రీటౌన్ సీఐ శివప్రసాద్

IMG20250624131903 కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్): జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు డి.ఎస్.పి రెహమాన్ సూచనలతో కొత్తగూడెం త్రీ టౌన్   పోలీసులు నార్కోటిక్ పై  యాంటీ డ్రగ్   సోల్జరు అవగాహన కార్యక్రమాన్ని కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ శివప్రసాద్ మాట్లాడుతూ.. యాంటీ డ్రగ్స్ వారోత్సవాల్లో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి ఒక్కరూ చెడు అలవాటులకు దూరంగా ఉండాలని, యువత చెడు వ్యసనాల బారినపడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని  అన్నారు. వారి వల్ల వారి కుటుంబం కూడా ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. ఇంట్లోని మగవారు బాగుంటేనే వారి కుటుంబం బాగుంటుందని అన్నారు. డ్రగ్స్ పై పోలీసు వారికి సమాచారం ఇవ్వాలనుకుంటే టోల్ ఫ్రీ నెంబర్  1908, నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్14446 కాల్ చేయగలరని కోరారు . ఈ కార్యక్రమంలో ఎస్సై విజయ కుమారి, ఏఎస్ఐ బివిఆర్ రఘు, సిబ్బంది రామారావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Views: 17
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!