త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం 

ప్రతి ఒక్కరు  చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

On
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం 

త్రీటౌన్ సీఐ శివప్రసాద్

IMG20250624131903 కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్): జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు డి.ఎస్.పి రెహమాన్ సూచనలతో కొత్తగూడెం త్రీ టౌన్   పోలీసులు నార్కోటిక్ పై  యాంటీ డ్రగ్   సోల్జరు అవగాహన కార్యక్రమాన్ని కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ శివప్రసాద్ మాట్లాడుతూ.. యాంటీ డ్రగ్స్ వారోత్సవాల్లో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి ఒక్కరూ చెడు అలవాటులకు దూరంగా ఉండాలని, యువత చెడు వ్యసనాల బారినపడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని  అన్నారు. వారి వల్ల వారి కుటుంబం కూడా ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. ఇంట్లోని మగవారు బాగుంటేనే వారి కుటుంబం బాగుంటుందని అన్నారు. డ్రగ్స్ పై పోలీసు వారికి సమాచారం ఇవ్వాలనుకుంటే టోల్ ఫ్రీ నెంబర్  1908, నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్14446 కాల్ చేయగలరని కోరారు . ఈ కార్యక్రమంలో ఎస్సై విజయ కుమారి, ఏఎస్ఐ బివిఆర్ రఘు, సిబ్బంది రామారావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Views: 15
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా నరేష్):జిల్లాలో 0-5 సంవత్సరాలలోపు వయసు గల పిల్లల ఆధార్ నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం...
సింగరేణి సోలార్ మోడల్ హౌస్ ప్రారంభం
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం..
మూడు కోట్ల విలువ చేసే ఏనుగు దంతాలను స్వాధీనం..
అధిక ఫీజులు వసూలుకు పాల్పడుతున్న నారాయణ విద్యాసంస్థలను బ్యాన్ చేయాలి
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం 
త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు