మభ్యపెట్టే నైపుణ్యం, సృజనాత్మకమైన దోపిడీ ‘సెయింట్ ఆంథోనీస్ విధానం’
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 19, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, విద్యానగర్ లో.. ఒకే గొడుగు క్రింద రెండు ‘ఆగడాలను అవలంబిస్తున్న’ సెయింట్ ఆంటోనీస్ విద్యాసంస్థ. సెయింట్ ఆంటోనీస్ పేరిట విద్యాలయం అనుమతులు 'ఎస్ బి అర్ ట్రేడర్స్' పేరిట వ్యాపార అమ్మకాలు జరుపుతూ అవసరాన్ని బట్టి ముసుగులు మారుస్తూ నీచమైన స్థితికి దిగజారి చట్టాలను ఉల్లంగిస్తున్న 'తుచ్ఛమైన సంస్థ' అని విద్యార్థుల తల్లి తండ్రులు ఆ సంస్థ పై దుమ్మెత్తిపోస్తున్నారు.
మభ్యపెట్టే నైపుణ్యం: సెయింట్ ఆంథోనీ ఉన్నత పాఠశాల నాణ్యమైన విద్య, 20 సంవత్సరాలకు పైగా విద్యా నైపుణ్యం, 20,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు విద్య, 300 పైగా అనుభవజ్ఞులైన సిబ్బంది, డైనమిక్ అభ్యాస అనుభవం కోసం అత్యాధునిక సౌకర్యాలు, విజయం పట్ల మక్కువ, బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరులను రూపొందించడం, విద్యాపరంగా సామాజికంగా భావోద్వేగపరంగా అభివృద్ధి చెందే పోషణ వాతావరణాన్ని అందించడం, వినూత్న బోధనా పద్ధతులు, ఆధునిక సౌకర్యా లు, విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం, ప్రతి విద్యార్థిలో బలమైన నైతిక విలువల బాధ్యతాయుత భావాన్ని పెంపొందించడం, ప్రపంచంలో రాణించడానికి అవసరమైన జ్ఞాన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడం, విద్యా పాఠ్యేతర కార్యకలాపాల సమతుల్య సమ్మేళనం, విద్యార్థులు నమ్మకంగా, నాయకులుగా మారడానికి సాధికారత కల్పించడం, ప్రతి బిడ్డకు ఉత్తమ ఫలితాలను నిర్ధారించడానికి తల్లిదండ్రులతో బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించడం అంటు పలు ‘నీతి వాక్యాలు చెబుతూ’.. ‘సెయింట్ ఆంథోనీస్’ విద్యాసంస్థ వారు సంగారెడ్డి, సదాశివపేట, మల్కాపూర్ శాఖలలో విద్యార్థులను వారి తల్లిదండ్రులను మభ్య పెడుతూ వారి నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు.
సృజనాత్మకమైన దోపిడీ: చట్టాలను ఎలా విస్మరించాలి? అధికారులను ఎలా లొంగదీసుకోవాలి? విద్య ముసుగులో వ్యాపారం ఎలా చెయ్యాలి? స్వంత ఆస్తులను ఏ రకంగా పెంచుకోవాలి? మోసం ఎలా చెయ్యాలి? విద్యార్థుల తల్లి తండ్రులను అభద్రతకు ఎలా గురిచెయ్యాలి? ఎలా మభ్యపెట్టాలి? భిన్నమైన రీతిలో ఎలా దోపిడీ చెయ్యాలి? మూడోకంటికి తెలియనీయకుండా సంబంధిత అధికారులకు అవినీతి లోబడేవిదంగా ఎలా ప్రభావితం చెయ్యాలి?.. అనే సృజనాత్మకమైన దోపిడీ పద్ధతు లను స్వయంగా ఆచరిస్తూ పరోక్షంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ‘సెయింట్ ఆంథోనీస్’ విద్యాసంస్థల వారు సంగారెడ్డి, సదాశివపేట, మల్కాపూర్ శాఖలలో పరోక్ష బోధన చేస్తున్నారు. నైతిక విలువలు, సామాజిక బాధ్యత కు తిలోదకాలు వదిలిపెట్టి విద్య-వ్యాపారం అనే బహుముఖ ముసుగులు ధరిస్తూ.. నమ్మకం కల్గించి దోచుకోవడమే వారసత్వంగా విధి విధానంతో ముందుకు వెళ్తున్నారు. సెయింట్ ఆంథోనీస్ సంస్థ ఆచరిస్తున్న ‘విధి విధానాలను’ విద్యార్థులు నేర్చుకొంటారు అనే కనీస ఇంకిత జ్ఞానము లేకుండా అడ్డదారిలో ఆర్థికంగా బలపడడమే పరమావధిగా 'విద్యలయం' అనే ముసుగు ధరించి సమాజాన్ని ‘సర్వనాశనం చేస్తున్నారని’ విద్యార్థులు తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే గొడుగు క్రింద రెండు ‘ఆగడాలను అవలంబిస్తు’ సెయింట్ ఆంటోనీస్ పేరిట విద్యాలయం అనుమతులు 'ఎస్ బి అర్ ట్రేడర్స్' పేరిట వ్యాపార అమ్మకాలు జరుపుతున్నప్పటికి ఇటు విద్యాశాఖ, అటు వాణిజ్య పన్నుల శాఖ రెండు శాఖల చేతకాని తనం స్పష్టంగా కనిపిస్తుందని విద్యార్థులు తల్లి తండ్రులు తెలియచేసారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ అక్రమాలను అదుపు చెయ్యవలసిన బాధ్యత జిల్లా కలెక్టర్ పై ఎంతైనా ఉందని హితువు పలికారు.
Comment List