జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'

• తక్షణమే స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం • సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు • ‘ట్రీట్‌మెంట్‌ లో నో కాంప్రమైజ్': ఆరోగ్యశాఖ మంత్రి

On
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 30, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు రక్షణ సహాయ చర్యలు అందించడం కోసం సంగారెడ్డి కలెక్టరేట్ లో  కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. ప్రమాద బాధితుల వివరాలు తెలుసుకోవడానికి వారికి తక్షణ సహాయ చర్యల కోసం 08455 276155 నెంబర్ తో కూడిన కంట్రోల్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తక్షణ సహాయ చర్యల కోసం, ప్రమాద బాధితుల వివరాల కోసం ఈ నెంబరు లో సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య  ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేశారు. పాశమైలారం దుర్ఘటనలో గాయపడి దృవ, ప్రణామ్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. బాధిత పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు మంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని డాక్టర్లకు మంత్రి సూచించారు. ట్రీట్‌మెంట్‌లో ఎటువంటి కాంప్రమైజ్ ఉండొద్దని ఆదేశించారు. బాధితుల ఆరోగ్యం కుదుటపడే వరకూ హాస్పిటల్స్‌లోనే ఉండి వారికి అవసరమైన వైద్య సహాయక సేవలు అందించాలని జిల్లా డీఎంహెచ్‌వోను, ఇతర మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లను మంత్రి ఆదేశించారు. చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులను హాస్పిటల్ వద్ద మంత్రి పరామర్శించి, వారిని ఓదార్చారు. జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వారికి మంత్రి భరోసానిచ్చారు. చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన, మృతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.Blast copy-12

Views: 95
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!