వినాయక లడ్డు వేలం పాట
91, 000 వెయ్యి రూపాయలు పలికిన లడ్డు
By Venkat
On
వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ వన్ లో లడ్డు వేలం
న్యూస్ ఇండియా తెలుగు ( తెలంగాణ బ్యూరో రిపోర్టర్ తాళ్లపల్లి వెంకన్న గౌడ్ )
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామం లోని వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ వన్ లో కొలువుదీరిన గణనాథుడు నవరాత్రులు ముగించుకొని గంగ స్నానానికి బయలుదేరాడు. ఈ సందర్భంగా గణనాధుని చేతిలోని లడ్డు వేలం పాట వేశారు. ఈ వేలం పాటలో ముఖ్య అతిథులుగా చౌదరిగూడ గ్రామ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ పాల్గొని విజయవంతం చేశారు. ఈ వేలం పాట పోటాపోటీగా సాగింది. చివరగా చౌదరిగూడ గ్రామ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ తనయుడు బైరు విగ్నేష్ గౌడ్ 91, 000 వెయ్యి రూపాయల కు లడ్డు నీ కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ వన్ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, ప్రజలు పాల్గొన్నారు.
Views: 124
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Dec 2025 21:07:15
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...

Comment List