పరిసరాలను.. పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం

సర్పంచ్ సుగుణ గంగాధర్

On
పరిసరాలను.. పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం

సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంగ్టి లో ఆదివారం రోజు స్థానిక ప్రభుత్వం ఆసుపత్రి ఆవరణలో స్వచ్ఛత హి సేవా పక్షోత్సవాలో భాగంగా ఆదివారం రోజు ఉదయం గ్రామ సర్పంచ్ సుగుణ గంగాధర్  ఎంపీపీ సంగీత వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో యువకులు మరియు ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి ఆవరణలో పిచ్చి మొక్కలు,చెత్తను తొలగించి ఒకగంట శ్రమాదానం చేశారు.ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిసరాల శుభ్రతతో పాటు  వ్యక్తిగత శుభ్రత ఉంచుకోవాలని అన్నారు. ఆరోగ్యం సమస్య రాకుండ ప్రతి ఒక్కరు జాగ్రత్త పాటించాలని సూచించారు. స్వచ్ఛతహి సేవా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుభాష్, డాక్టర్ బి నాగమణి,ఆసుపత్రి సిబ్బంది, గ్రామ ప్రజలు పాలొగొన్నారు.IMG_20231001_204144

Views: 60
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News