ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

On
ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

పాలాభిషేకం చేస్తున్న ఆదిభట్ల మున్సిపాలిటీ బిజెపి నాయకులు

 రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు  గంగాపురం కిషన్ రెడ్డి పిలుపుమేరకు ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగులూరు ఎక్స్ రోడ్ యందు ఆదిభట్ల మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షుడు శిగ వీరస్వామి గౌడ్ ఆధ్వర్యంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  కృష్ణా ట్రిబ్యునల్ ,పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, మహిళలకు 33% రిజర్వేషన్  ప్రకటించినందుకు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగినది.కార్యక్రమానికి ముఖ్య అతిథి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పొట్టి రాములు  మాట్లాడుతూ తెలంగాణలో మార్పు బిజెపితోనే సాధ్యమని బీజేపీ పార్టీ రాష్ట్రంలో రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని మా ప్రధానమంత్రి నెరవేరుస్తున్నారని స్పష్టం చేశారు. నిజాంబాద్ లో పసుపు బోర్డు ములుగులో సమ్మక్క సారక్కల పేర్లపై గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయునట్లు ప్రకటించడం కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని బ్రిజేష్ కుమార్ అప్పజెప్పి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశంలో చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం మనమంతా ఆశించదగ్గ విషయం తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆదరణతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు శిగ ప్రభాకర్ గౌడ్, మనోహర్ లాల్, ఆదిభట్ల మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు సిద్ధ గౌని గణేష్ గౌడ్, ఐలయ్య, ఆదిభట్ల మున్సిపాలిటీ మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లెపల్లి శ్రీదేవి, మహేష్, యాదగిరి, తులసిగారి కుమార్, రాజు, శ్రీశైలం, ఆంజనేయులు, పద్మ, శోభ, వరలక్ష్మి, మహేశ్వరి, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Views: 29
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు