సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి: ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి

By Khasim
On
సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి: ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ నాగార్జున రెడ్డి  అధికారులకు సూచించారు. మండలంలోని గొట్లగట్టు సచివాలయము పరిధిలో వెలుగొండ రాయుని పల్లె గ్రామంలో బుధవారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కర దీపికలను పంపిణీ చేస్తూ ఏమ్మా, ఏం  పెద్దాయన మీకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా, వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలను తెలుసుకుంటున్నారా లేదా అని పలువురిని అడుగుతూ ఆరా తీశారు. జగనన్న ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. భవిష్యత్తులో జగనన్న ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు..  సమస్యలను ఎమ్మెల్యే  కేపీ నాగార్జున రెడ్డి గారికి గ్రామస్తులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి ,ఎంపీపీ, జెడ్పిటిసి, మండల కన్వీనర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.IMG-20231018-WA0526(1)

Views: 6

About The Author

Post Comment

Comment List

Latest News

ఆప్యాయత చిరునామా అమ్మ .. ఆప్యాయత చిరునామా అమ్మ ..
అమ్మకదిలే దైవం అమ్మ హృదయమే కోవెల అమ్మ ఆప్యాయత చిరునామా అమ్మ అనురాగం వీలునామ అమ్మరెండు అ..క్షరాల పరవశం అమ్మపెదవే పలికిన తీయని మాటే అమ్మతేనె లొలికే...
సమాజ హిత "విజయ"గర్వం...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.