గద్దర్ వారసులు ఎవరు?

గద్దర్ కుటుంబంలో బయటపడ్డ రాజకీయ విభేదాలు.. టికెట్ కోసం వారసుల మధ్య పోటీ

On
గద్దర్ వారసులు ఎవరు?

ప్రజా యుద్ధ నౌక గద్దర్ కుటుంబంలో విభేదాలు రాజకీయంగా బయటపడ్డాయి. కంటోన్మెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ వస్తుందని ఆశించిన గద్దర్ కొడుకు సూర్యంకు సొంత కుటుంబం నుంచే ఎదురు దెబ్బ తగిలింది. ఇంతకీ గద్దర్ కుటుంబం ఏం జరుగుతుంది..?

గద్దర్Gaddaar చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల విభేదాలు బయటకు వచ్చాయి. గద్దర్ కొడుకు సూర్యంకు 2018 లోని పెద్దపల్లి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని భావించారు. కానీ ఆయన పోటీకి వెనక్కి తగ్గడంతో టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గద్దర్‌కు కొత్త సంబంధాలు ఏర్పాటులో ఈసారి పోటీ చేస్తారని భావించారు. కానీ గద్దర్ అకాల మరణం తర్వాత గద్దర్ కొడుకు సూర్యంకు రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా గద్దర్ కూతురు వెన్నెల ప్రెస్ మీట్ పెట్టి.. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కంటోన్మెంట్ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

దీంతో గద్దర్ ప్రజా పార్టీ వారసులు ఎవరన్న చర్చ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందన్న చర్చ ప్రారంభం అయింది. దీంతో కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి రాజకీయ విభేదాలు ఒకసారి గా బయటకు వచ్చాయి. ఇంతకీ గద్దరు వారుసులు ఇద్దరిలో రాజకీయ వారసులు ఎవరో, కాంగ్రెస్ పార్టీ గద్దర్ కొడుకు సూర్యంకు.. కూతురు వెన్నెలకి టికెట్ ఇస్తారో  వేచి చూడాల్సి ఉంది.

Views: 31

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

షాద్ నగర్‌లో మళ్లీ ఊపందుకున్న ఓపెన్ ప్లాట్ల బిజినెస్! ఫ్యూచర్ సిటీ ఎఫెక్ట్ మొదలైందా?r Title షాద్ నగర్‌లో మళ్లీ ఊపందుకున్న ఓపెన్ ప్లాట్ల బిజినెస్! ఫ్యూచర్ సిటీ ఎఫెక్ట్ మొదలైందా?r Title
షాద్ నగర్‌లో ఓపెన్ ప్లాట్ల మార్కెట్ మళ్లీ వేగం పుంజుకుంటోంది. భారత్ ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, జాతీయ రహదారి కనెక్టివిటీ వంటి అంశాలు ఈ...
వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాలు ఇవే!
తొర్రూరులోనే అత్యాధునిక లాప్రోస్కోపి శస్త్రచికిత్సలు నిర్మల హాస్పిటల్
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఎస్సీ విద్యార్థుల ఆందోళన..
నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
వనజ మృతిపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్ ఆరా 
గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి