టేక్మాల్ మండలంలో కుసంగి గ్రామంలోని యువజన సంఘం ఆధ్వర్యంలో విరాట్ కోహ్లీ పుట్టినరోజు వేడుకలు
న్యూస్ ఇండియా నవంబర్ 6 (టేక్మాల్ ప్రతినిథి జైపాల్) ఉమ్మడి మెదక్ జిల్లాలో టేక్మాల్ మండలంలోని కుసంగి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు పంచుకుని ఘనంగా ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. భారత్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ లో ‘కింగ్ కోహ్లీ’ బ్యాట్ తో పరుగుల వరద పారియిస్తున్నాడు. విరాట్ ఈ వరల్డ్ కప్ లో ఏడు మ్యాచ్ లు ఆడగా.. 442 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ సెంచరీ చేయడం ద్వారా సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేయాలని క్రికెట్ అభిమానులు అయా గ్రామాలలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు
Views: 131
About The Author
Related Posts
Post Comment
Latest News
22 Feb 2026 08:27:07
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) ఫిబ్రవరి 21:దక్షిణ మధ్య రైల్వేలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న అగ్నిమాపక భద్రతా స్పెషల్ డ్రైవ్ అవగాహనా కార్యక్రమంలో భాగంగా పి.ఎస్.ఆర్...

Comment List