మేము ఓట్లు వేయం.. ఎందుకు వేయాలి.....??

కనీసం పట్టించుకోవడం లేదంటూ

On
మేము ఓట్లు వేయం.. ఎందుకు వేయాలి.....??

న్యూస్ ఇండియా తెలుగు, సెప్టెంబర్ 17

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని మారుమూల గొత్తికోయ గ్రామాల ప్రజలు ఓట్లు వేసేందుకు నిరాకరిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో ప్రజా ప్రతినిధుల గద్దెనెక్కిన పాలకులు వారిని WhatsApp Image 2023-11-17 at 4.50.56 PM, వలసవాదులంటూ నెపాన్ని మోపి అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచుతున్నారని ఆరోపిస్తున్నారు
 
ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఏజెన్సీలోని గొత్తికోయ గిరిజన ప్రాంతాల్లోని  గొత్తి కోయ గ్రామాల ప్రజలంతా తమకు రాజ్యాంగపరంగా వచ్చే ఒక్క ఓటు హక్కు మినహా ఏ ఇతర సౌకర్యాన్ని కూడా సంవృద్ధిగా అందించని పాలకులు మళ్ళీ ఓట్ల కోసం తమ గ్రామాలకు వస్తున్నారని వేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా వాస్తవానికి కష్టపడి చదువుకున్న గొత్తికోయ యువతచదువు చట్టుబండలుగా మారుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
 
జిల్లాలోని అశ్వారావుపేట మండల గొత్తికోయ గిరిజన ప్రాంతాల్లో. ఈ గ్రామాలలో సుమారు 600ల నుంచి 700ల వరకు జనాభా కలిగి ఉన్నప్పటికీ వీరికి సరైన గుర్తింపు లేదు. బచ్చువారి గుడెం,గాండ్లగూడెం, గ్రామ పంచాయితీలో గల  గొత్తికోయలకు కనీసం తాగడానికి నీళ్ళు లేక ఎన్నో ఇబ్బందుకు గురవుతున్నారని,వాటివల్ల అనారోగ్య సమస్యలు పిడిస్తున్నాయి, కనీసం దారి మార్గం సౌకర్యం లేక కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేక ఆ ప్రాంత వాసులు అంధకారంలో మగ్గుతున్నారు. ఉన్న అంగన్వాడీకి పక్కా భవనం లేదు.ఇంకా కటిక దారిద్య్రంలో మగ్గుతున్నరు అడవి బిడ్డలు.
 
మండలం లోని కొత్త కావడిగుళ్ల గొత్తికోయల పాకల రహదారే కాదు విద్యుత్ సౌకర్యం కానీ, మంచినీటి వసతి గానీ ఏమీ లేకుండా ఏళ్ళ కాలంగా అలాగే మగ్గి పోతున్నారు. అంతేకాకుండా సదరు మారుమూల ప్రాంతాలలో నివసించే గుత్తి కోయ ప్రజలు మైదాన ప్రాంతానికి రావాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. వర్షాకాలంలో ఈ సమస్య తీవ్రస్థాయిలో ఉండగా ఇప్పటికి ఏమైనా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు రహదారి సౌకర్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు  .
 
ప్రస్తుతం గొత్తికోయలకు ఓటు హక్కు కలిగి ఉండగా ఈ గ్రామాల్లోని సుమారు అత్యధికంగానే సభ్యులు ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికీ ఆ ఓటును వినియోగించుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఏళ్ళ కాలం గడిచినా వారికి అందని ప్రోత్సాహంతో ప్రశ్నించేందుకు సిద్దంగా ఉన్న ఆ గొత్తికోయ గ్రామాల వైపు వెళ్ళే పోటీ అభ్యర్థులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. వారి సమస్యను పరిష్కరించే విధంగా కార్యాచరణ చేసే వారికే ఓట్లు వేస్తామని ఆ గొత్తికోయ గ్రామాలు ముక్త కంఠంతో తెలుపుతున్నారు. లేదంటే ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా వెళ్ళమంటున్నారు.
Views: 13
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక