ముక్కోటి ఏర్పాట్లు పరిశీలించిన భద్రాద్రి కలెక్టర్ ఎస్పీ

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు

On

టికెట్లు ఆన్లైన్ ద్వారా విక్రయం

 భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )డిసెంబర్ 17:ముక్కోటి మహోత్సవాలకు భద్రాచలం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఆదివారం దేవాలయం వద్ద ముక్కోటి మహోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రాచలం విచ్చేయభక్తుల సౌకర్యార్థం టికెట్లు ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నట్లు చెప్పారు. భక్తులు వచ్చినట్లు ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని ఆమె సూచించారు. 22న గోదావరిలో జరిగే స్వామి వారి తెప్పోత్సవం, 23న జరుగు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాలకు విచ్చేయు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెక్టార్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి సెక్టారులో ఏర్పాట్లు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా రోడ్లపైకి వచ్చిన దుకాణాలను తొలగించాలని ఆమె సూచించారు. అనంతరం సెక్టారులను పరిశీలించి దేవస్థానం అధికారులకు తగు సూచనలు చేశారు.ఎస్పీ డాక్టర్ వినిత్ మాట్లాడుతూ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఒక గంట ముందుగానే వారికి కేటాయించిన సెక్టారులకు చేరుకోవాలని సూచించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ రెండు రోజులు పాటు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని భక్తులు గమనించి అధికారి యాత్రంగానికి సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రమాదేవి, ఆలయ ప్రధాన అర్చకులు సీతారామనుజాచార్యులు, ఆర్డిఓ మంగీలాల్, మండల ప్రత్యేక అధికారి నాగలక్ష్మీ,  ఇరిగేషన్ ఈ ఈ రాంప్రసాద్, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Views: 40

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి
  ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన
కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్