*దాతల సహకారంతో  దుప్పట్లు, స్టడీ మెటీరియల్ పంపిణీ*

*వెంకటాపురం సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు కొండ యాకన్న గౌడ్.*  

*దాతల సహకారంతో  దుప్పట్లు, స్టడీ మెటీరియల్ పంపిణీ*

IMG-20231226-WA0009

*తొర్రూరు మండలం, వెంకటాపురం గ్రామంలో  సోమవారం రోజున వెంకటాపురం సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు కొండ యాకన్న గారి ఆధ్వర్యంలో వెంకటాపురం సేవా ట్రస్ట్ కు ప్రతినెల దాతలు అందిస్తున్న సహకారంతో గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు దుప్పట్ల పంపిణీ, అదేవిధంగా 10వ తరగతి చదువుకునే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొండ యాకన్న గౌడ్ మాట్లాడుతూ వెంకటాపురం గ్రామంలో గత ఐదు సంవత్సరాల పైగా దాతల సహకారంతో సేవా ట్రస్ట్ ద్వారా చాలా కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయడం, నిత్యవసర వస్తువుల పంపిణీ, సన్న బియ్యం పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు  నిరంతరం గ్రామంలో చేయడం జరుగుతుంది.  అందుకు సహకరిస్తున్న దాతలందరికి  పేరుపేరునా ధన్యవాదములు తెలియజేస్తు, ఇక ముందు కూడా దాతల సహకారంతో గ్రామంలోని నిరుపేద కుటుంబలను ఆదుకోవడమే వెంకటాపురం సేవ ట్రస్ట్ లక్ష్యంగా పని చేస్తామని తెలియజేశారు.*

*ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బొలగాని శ్రీనివాస్ గౌడ్ , కొండ ఉప్పమ్మ, యువకులు, మహిళలు పాల్గొన్నారు.*

Views: 21
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 20:ఆదివారం నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షకు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని...
వనజ మృతిపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్ ఆరా 
గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి
కుంజ వనజ మృతి పై డిఎంహెచ్ఓ విచారణ
సింగరేణిలో వ్రాత పరీక్షలు
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..