కాంగ్రెస్ ప్రోటోకాల్ ఉల్లంఘన కొండా వర్సెస్ పల్లా

ఇద్దరి మధ్య వాగ్వాదం

On
కాంగ్రెస్ ప్రోటోకాల్ ఉల్లంఘన కొండా వర్సెస్ పల్లా

మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. దీంతో సిద్దిపేట హరిత హోటల్లో జరిగిన సమీక్ష సమావేశం నుంచి రాజేశ్వర్ రెడ్డి ఉన్నట్టుండి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నాయకులను స్టేజి మీదకు పిలిచే విషయంలో.. మంత్రి ప్రోటోకాల్ ఉల్లంఘించిందని ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సమీక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. సంప్రదాయాలకు, ఆచార కట్టుబాట్లకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారనన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిన వారిని కూడా స్టేజీ మీదికి పిలవడం చాలా దురదృష్టకరమని చెప్పారు.

మల్లికార్జున స్వామిని దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ సమావేశాన్ని హోటల్లో పెట్టలేదన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కూడా వెళ్లిపొమ్మనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. తమ హయాంలో ఇలా ఎప్పుడూ రాజకీయాలను ఉపయోగించుకోలేదని ఆయన పేర్కొన్నారుWhatsApp-Image-2023-12-30-at-18.29.58-696x361

Views: 31
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్