కాంగ్రెస్ ప్రోటోకాల్ ఉల్లంఘన కొండా వర్సెస్ పల్లా

ఇద్దరి మధ్య వాగ్వాదం

By Venkat
On
కాంగ్రెస్ ప్రోటోకాల్ ఉల్లంఘన కొండా వర్సెస్ పల్లా

మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. దీంతో సిద్దిపేట హరిత హోటల్లో జరిగిన సమీక్ష సమావేశం నుంచి రాజేశ్వర్ రెడ్డి ఉన్నట్టుండి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నాయకులను స్టేజి మీదకు పిలిచే విషయంలో.. మంత్రి ప్రోటోకాల్ ఉల్లంఘించిందని ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సమీక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. సంప్రదాయాలకు, ఆచార కట్టుబాట్లకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారనన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిన వారిని కూడా స్టేజీ మీదికి పిలవడం చాలా దురదృష్టకరమని చెప్పారు.

మల్లికార్జున స్వామిని దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ సమావేశాన్ని హోటల్లో పెట్టలేదన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కూడా వెళ్లిపొమ్మనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. తమ హయాంలో ఇలా ఎప్పుడూ రాజకీయాలను ఉపయోగించుకోలేదని ఆయన పేర్కొన్నారుWhatsApp-Image-2023-12-30-at-18.29.58-696x361

Views: 30
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రాజ్యాంగం దినోత్సవం రాజ్యాంగం దినోత్సవం
  పౌరుడు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని  అంబేద్కర్ వాది సోమారపూ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో  అంబేద్కర్ సంఘం  ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ