కష్టకాలంలో విజయ్ బ్లడ్ బ్యాంక్ (ఎఫ్.ఏ) ద్వారా ఉచిత రక్త దానం

On
కష్టకాలంలో విజయ్ బ్లడ్ బ్యాంక్ (ఎఫ్.ఏ) ద్వారా ఉచిత రక్త దానం

గిద్దలూరు న్యూస్ ఇండియా

కర్నూల్ జిల్లా నంద్యాలలో మాణిక్యమ్మ (35) అనే మహిళ అనారోగ్యంతో గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే మాణిక్యమ్మ(35) కి రక్తం తక్కువగా ఉన్నదని వైద్యులు తెలిపారు. మాణిక్యమ్మ బ్లడ్ బి - పాజిటివ్ కొరకు ఎదురుచూస్తున్న తరుణంలో విజయ్ బ్లడ్ బ్యాంక్ (ఎఫ్.ఏ) ఫౌండర్ విజయ్ తమ అసోసియేషన్ తరపున ఉచితంగా రక్తం ఏర్పాటు చేశారు.నంద్యాల బ్రాంచ్ నుండి విజయ్ బ్లడ్ బ్యాంక్ (ఎఫ్.ఏ ) సభ్యుడు ఆర్.నగేష్ తక్షణమే స్పందించి మాణిక్యమ్మ కి రక్త దానం చేశారు.కనుక ఆర్.నగేష్ ని విజయ్ బ్లడ్ బ్యాంక్ స్థాపకుడు విజయ్ కుమార్ అభినందించారు.సాయం పొందిన మహిళ మాణిక్యమ్మ విజయ్ బ్లడ్ బ్యాంక్ స్థాపకుడు విజయ్ కుమార్, రక్త దాత ఆర్.నగేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులో ఈ అసోసియేషన్ ఎంతో ఉన్నత స్థానాలను చేరుకుని, ఎంతో మందికి ఉపయోగ పడాలని కోరారు.

IMG-20240108-WA0951
పేషంట్ మాణిక్యమ్మ(35) కి రక్త దానం చేస్తున్న విజయ్ బ్లడ్ బ్యాంక్ (ఎఫ్.ఏ) సభ్యుడు ఆర్.నగేష్
Views: 211

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News