కష్టకాలంలో విజయ్ బ్లడ్ బ్యాంక్ (ఎఫ్.ఏ) ద్వారా ఉచిత రక్త దానం

On
కష్టకాలంలో విజయ్ బ్లడ్ బ్యాంక్ (ఎఫ్.ఏ) ద్వారా ఉచిత రక్త దానం

గిద్దలూరు న్యూస్ ఇండియా

కర్నూల్ జిల్లా నంద్యాలలో మాణిక్యమ్మ (35) అనే మహిళ అనారోగ్యంతో గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే మాణిక్యమ్మ(35) కి రక్తం తక్కువగా ఉన్నదని వైద్యులు తెలిపారు. మాణిక్యమ్మ బ్లడ్ బి - పాజిటివ్ కొరకు ఎదురుచూస్తున్న తరుణంలో విజయ్ బ్లడ్ బ్యాంక్ (ఎఫ్.ఏ) ఫౌండర్ విజయ్ తమ అసోసియేషన్ తరపున ఉచితంగా రక్తం ఏర్పాటు చేశారు.నంద్యాల బ్రాంచ్ నుండి విజయ్ బ్లడ్ బ్యాంక్ (ఎఫ్.ఏ ) సభ్యుడు ఆర్.నగేష్ తక్షణమే స్పందించి మాణిక్యమ్మ కి రక్త దానం చేశారు.కనుక ఆర్.నగేష్ ని విజయ్ బ్లడ్ బ్యాంక్ స్థాపకుడు విజయ్ కుమార్ అభినందించారు.సాయం పొందిన మహిళ మాణిక్యమ్మ విజయ్ బ్లడ్ బ్యాంక్ స్థాపకుడు విజయ్ కుమార్, రక్త దాత ఆర్.నగేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులో ఈ అసోసియేషన్ ఎంతో ఉన్నత స్థానాలను చేరుకుని, ఎంతో మందికి ఉపయోగ పడాలని కోరారు.

IMG-20240108-WA0951
పేషంట్ మాణిక్యమ్మ(35) కి రక్త దానం చేస్తున్న విజయ్ బ్లడ్ బ్యాంక్ (ఎఫ్.ఏ) సభ్యుడు ఆర్.నగేష్
Views: 213

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 9: అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేత...
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి