దేశాన్ని సంక్షేమ బాట పట్టించిన మహనీయుడు..

దివంగత నేత మాజీ సీఎం ఎన్టీఆర్ కు ఘన నివాళి...

On
దేశాన్ని సంక్షేమ బాట పట్టించిన మహనీయుడు..

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావుల వీరేశం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.

దివంగత నేత మాజీ సీఎం ఎన్టీఆర్ కు ఘన నివాళి 

బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన మహానేత

టీడీపీ అనేది రాజకీయ పార్టీ కాదు ఒక వ్యవస్థ

దేశాన్ని సంక్షేమ బాట పట్టించిన మహనీయుడు..

Read More రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..

అబ్దుల్లాపూర్మేట్, జనవరి18(న్యూస్ ఇండియా తెలుగు): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావుల వీరేశం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.

Read More పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..

IMG-20240118-WA0128
కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ రామ్ రెడ్డి

ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ చైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి హాజరై తెలుగుదేశం పార్టీ నాయకులతో తారక రామారావుకి నివాళులర్పించి పేదలకు పండ్లు పంపిణీ చేశారు.ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు. టీడీపీని స్థాపించి ప్రతి తెలుగు బిడ్డకు ఆత్మవిశ్వాసం కల్పించారని తెలిపారు. ఎంతోమందికి రాజకీయ ఓనమాలు నేర్పారన్న ఆయన.. ఎన్టీఆర్​ ఓ పొలిటికల్​ హీరో అని వ్యాఖ్యానించారు. పేదవాడి ఆకలి తీర్చిన అమ్మ, ఆడవారికి అండగా నిలిచిన అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. టీడీపీ అనేది రాజకీయ పార్టీ కాదని.. ఒక వ్యవస్థ .. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శ జిలమోని రవిందర్, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి ఇందర్ జి, కోశాధికారి పందిరి చక్రధర్ గుప్తా, స్థానిక కౌన్సిలర్లు కొత్త కుర్మా మంగమ్మ శివకుమార్, కోశిక ఐలయ్య, బాగ్యమ్మ ధన్ రాజ్, నాయకులు శేఖర్ గౌడ్, భుజంగరెడ్డి, మురళిగౌడ్, దాసు, వెంకటేశ్, శ్రీనివాస్ చారి, రవి నాయక్, శంకర్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మయ్య గౌడ్, దాసు, బాష్య నామక్, రామయ్య, శ్రీధర్ రెడ్డి, కృష్ణయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..

Views: 29

About The Author

Post Comment

Comment List

Latest News