సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ డైరీ ఆవిష్కరన

జర్నలిస్ట్ డైరీని ఆవిష్కరించిన మంత్రి దామోదర రాజనరసింహ మరియు జిల్లా కలెక్టర్ క్రాంతి

On
సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ డైరీ ఆవిష్కరన

IMG-20240123-WA0016సంగారెడ్డి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రూపొందించిన 2024 నూతన డైరీని మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అయన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, జర్నలిస్ట్ సమస్యల పట్ల సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు అందజేస్తామని తెలిపారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు ఎం.సాయినాథ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి కు నూతన సంవత్సర డైరీను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ డైరీలో ఎంతో విలువైన సమాచారం అందించారని, అందుకు అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. జర్నలిస్టులు ప్రజోపయోగకరమైన అంశాలపై సూచనలు, సలహాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.సాయినాథ్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, కోశాధికారి నాగభూషణం, అసోసియేషన్ సభ్యులు ఎర్ర వీరేందర్ గౌడ్, సునీల్, పుండరీకం, రాజేష్, ఆంజనేయులు, నర్సింలు, బక్కప్ప, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Views: 48
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News