యాన్ అమేజింగ్ ఇండియన్ మాచన రఘునందన్..
వరల్డ్ నో టుబాకో కాన్ఫరెన్స్ లో వక్తల కితాబు..
యాన్ అమేజింగ్ ఇండియన్
మాచన రఘునందన్..
వరల్డ్ నో టుబాకో కాన్ఫరెన్స్ లో వక్తల కితాబు..

హైదరాబాద్, మే 26, న్యూస్ ఇండియా ప్రతినిధి: ధూమపానం ఎంతో మంది జీవితాల్ని చిద్రం చేస్తోంది అనే ఆవేదన,ఎంతో మంది యువత తెలిసో తెలియకో స్మోకింగ్ కు అలవాటు అవుతున్నారు అనే కసి,వెరసి ఓ సాదా సీదా ఉద్యోగి ని.. వాట్ ఈస్ దిస్..?! కెన్నాట్ వి స్టాప్ ఇట్?!(మనం దీన్ని ఆపలేమా?!) అని ప్రపంచ పొగాకు వ్యతిరేక సదస్సు లో ప్రశ్నించే లా చేసింది. ఎట్ లిస్ట్ లెట్ అస్ కంట్రోల్ ఇట్ (ఇక నైనా నియంత్రించే ప్రయత్నం చేద్దాం) అని ప్రార్థించేలా చేసింది. ఓ వ్యక్తి సమాజ హిత కాంక్ష, తపన..ప్రపంచ పొగాకు వ్యతిరేక చర్చా వేదిక ను సైతం *వావ్.. మాచన రఘునందన్..వాట్ ఏ అమేజింగ్ ఇండియన్* అని కొనియాడేలా చేసింది. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్విట్జర్లాండ్ జెనీవా లో మే 29 న వరల్డ్ నో టుబాకో కాన్ఫరెన్స్ జరగనుంది.ఈ కార్యక్రమం లో పాల్గొనే వాళ్ళ తో ఆదివారం రాత్రి వేబినార్ నిర్వహించారు. మే 29 న జరిగే ప్రపంచ పొగాకు వ్యతిరేక సదస్సు లో ఏ యే అంశాలు చర్చించాలి అనే అంశాల పై కూలంకుషంగా చర్చించారు.ఈ క్రమం లో నే మాచన రఘునందన్ తెలంగాణ లో 5 ఏళ్ల లో 5000 కిలో మీటర్లు ప్రయాణిస్థూ..500 గ్రామాల్లో దాదాపు 50,000 మంది ని పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్ధాలను వివరించడం లో చేసిన అసాధారణ కృషి ని పొగాకు నియంత్రణ సంస్థలు, నిపుణులు శ్లాఘించారు.ఈ మేరకు రఘునందన్ సోమవారం నాడు మాట్లాడుతూ.. మే 29 న జరిగే సదస్సు లో ఆన్లైన్ లో పాల్గొననున్నట్టు చెప్పారు.
Comment List