ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువేయడంలో పత్రికల పాత్ర కీలకం

On
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువేయడంలో పత్రికల పాత్ర కీలకం

న్యూస్ ఇండియా యర్రగొండపాలెం:IMG-20240127-WA1459(1)

ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధి పత్రికలని ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువేయడంలో పత్రికల పాత్ర కీలకమని తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం లో న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక 2024 సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికల పాత్ర కీలకమైంది అన్నారు.వీటికి స్వేచ్ఛ ముఖ్యమన్నారు. పత్రికల్లో పని చేసే జర్నలిస్టులకు పత్రికలకు కూడా స్వేచ్ఛ ఉండాలని ఆయన అన్నారు. ఏ అధికారి గాని రాజకీయ నేతలకు గాని భయపడకుండా నిర్భయంగా నిస్సంకోచంగా వార్తలు రాసి నిజా నిజాలను నిగ్గు తేర్చాల్సిన అవసరం పాత్రికేలపై ఉందన్నారు. ప్రజలకు బలం పత్రికలని అన్నారు. అందుకే ప్రజల పక్షాన నిలిచే ‘న్యూస్ ఇండియా ’ పత్రిక ప్రజలకు అన్నివేళలా అండగా ఉండగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ న్యూస్ ఇండియా దినపత్రిక మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ నాయకులు హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ పత్రికలు లేకుండా నేటి సమాజంలో ప్రజల మనుగడ అసాధ్యం అన్నారు.పత్రికలు గాని మీడియా కానీ ప్రజలకు ఎప్పటికప్పుడు వార్తలు చేరవేస్తూ చైతన్య పరచడంలో వాటికవే సాటి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కోప్పర్తి ఓబుల రెడ్డి, సచివాలయ కన్వీనర్ షేక్ జబీవుల్లా, ఒంగోలు సుబ్బారెడ్డి, కృష్ణ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 59
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
తమిళ రాజకీయాల్లో భారీ ట్విస్ట్..! దళపతి విజయ్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. స్టాలిన్‌ను కలవడం...
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం