రాజన్న ఆలయానికి 20కోట్ల నిధులు విడుదల... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్

వేములవాడ, జనవరి31, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
రాజన్న ఆలయానికి 20కోట్ల నిధులు విడుదల... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్

వేములవాడ రాజన్న దేవాలయానికి   హెచ్ఎండీఏ నుంచి రావాల్సిన రూ.20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని హెచ్ఎండీఏ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బుధ‌వారం డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో వేముల‌వాడ టెంపుల్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ, హైద‌రాబాద్ ట్రాఫిక్‌, గ్రేట‌ర్ ప‌రిధిలో ట్రాఫిక్ ర‌ద్దీ వంటి ప‌లు అంశాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.

IMG-20240131-WA0061

కాగా, వేములవాడలో బ్రిడ్జి నిర్మానానికి 30 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారిని ఆదేశించారు. అంతేకాకుండా వేములవాడ చెరువు సుందరీకరణకు ప్రత్యేక నిధులు ఇస్తామని హామీనిచ్చారు. త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

వేములవాడలో బ్ర ఏర్ర్తస్థాయిలో చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Read More జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'

IMG-20240131-WA0062

Read More ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 

సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన ఈ సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సంబంధిత అధికారులు హాజరయ్యారు.

Read More రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..

IMG-20240131-WA0063

 

Views: 42
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News