బైండోవర్ నిబంధనలను పాటించని వ్యక్తి కి రూ. 30వేల జరిమానా విధింపు..!
- నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన - ఎస్సై అశోక్..
On
బైండోవర్ నిబంధనలను పాటించని వ్యక్తి కి జరిమానా విధించినట్లు రుద్రంగి ఎస్సై సిరిసిల్ల అశోక్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గొల్లెం నర్సింగ్ అనే వ్యక్తి గత సంవత్సరం నవంబరులో 09వ తేదీన తాసిల్దార్,ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు రుద్రంగి పోలీస్ వారు మంచి మర్యాదపూర్వకంగా బైండోవర్ చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు. గొళ్ళెం నర్సింగ్ బైండ్ ఓవర్ నిబంధనలను పాటించాకపోవడంతో నేరంలో పాల్గొనడం జరిగిందని, క్రమశిక్షణతో లేడని ఈ నేల 05వ తేదీన రుద్రంగి తాసిల్దార్ శ్రీలతకి 30వేల రూపాయలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అట్టి జరిమానా కట్టినట్టు ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు. ఇలాంటి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.
Views: 267
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
21 Oct 2024 21:49:23
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
Comment List