రూ. లక్ష లంచం డిమాండ్

అవినీతి శాఖకు చిక్కిన మాదాపూర్ ఎస్ఐ

By Venkat
On
రూ. లక్ష లంచం డిమాండ్

స్టేషన్‌ రైటర్‌ విక్రమ్‌,ఎస్ఐ

హైదరాబాద్‌ : లంచం తీసుకుంటూ మాదాపూర్‌ ఎస్సై రంజిత్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఈ కేసులో స్టేషన్‌ రైటర్‌ విక్రమ్‌ను కూడా అనిశా అధికారులు విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్‌ సాయినగర్‌లో లక్ష్మణ్‌ నాయక్‌ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే, తన స్థలంలో ఇల్లు కడుతున్నాడంటూ ఆయనపై సుధ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై రంజిత్‌.ఆయన్ని పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఫోన్‌ చేశారు.రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.తన స్థలంలో ఇల్లు కట్టుకుంటే డబ్బులెందుకు ఇవ్వాలని లక్ష్మణ్‌ ఎదురు ప్రశ్నించారు.ఇవ్వకపోతే కూతురు, అల్లుడిపై కేసు నమోదు చేస్తామని ఆయన్ని బెదిరించారు. రూ.20 వేలు మాత్రమే ఇస్తానని చెప్పిన లక్ష్మణ్‌..  ఇదే విషయంపై అనిశా అధికారులకు ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిపై నిఘా ఉంచిన అనిశా లక్ష్మణ్‌ డబ్బులిస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.IMG_20240407_131841

Views: 55
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తల్లి పేరుతో ఒక చెట్టు తల్లి పేరుతో ఒక చెట్టు
పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు మేరా యువ భారత్ వారి సహకారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం సుదిమల్ల గ్రామంలో మరియు అశ్వాపురం...
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే 
టికెట్ ఎవరికైనా గెలుపు కోసం కృషి చేయండి
బిఆర్ఎస్ నాయకుల పై కేసులు నమోదు
కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా బిఆర్ఎస్ బైక్ ర్యాలీ 
కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్–సిపిఐ పొత్తు చిత్తు అయిందా?
కొత్తగూడెం కార్పొరేషన్ అభ్యర్థుల స్కృట్నీ