రూ. లక్ష లంచం డిమాండ్

అవినీతి శాఖకు చిక్కిన మాదాపూర్ ఎస్ఐ

By Venkat
On
రూ. లక్ష లంచం డిమాండ్

స్టేషన్‌ రైటర్‌ విక్రమ్‌,ఎస్ఐ

హైదరాబాద్‌ : లంచం తీసుకుంటూ మాదాపూర్‌ ఎస్సై రంజిత్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఈ కేసులో స్టేషన్‌ రైటర్‌ విక్రమ్‌ను కూడా అనిశా అధికారులు విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్‌ సాయినగర్‌లో లక్ష్మణ్‌ నాయక్‌ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే, తన స్థలంలో ఇల్లు కడుతున్నాడంటూ ఆయనపై సుధ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై రంజిత్‌.ఆయన్ని పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఫోన్‌ చేశారు.రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.తన స్థలంలో ఇల్లు కట్టుకుంటే డబ్బులెందుకు ఇవ్వాలని లక్ష్మణ్‌ ఎదురు ప్రశ్నించారు.ఇవ్వకపోతే కూతురు, అల్లుడిపై కేసు నమోదు చేస్తామని ఆయన్ని బెదిరించారు. రూ.20 వేలు మాత్రమే ఇస్తానని చెప్పిన లక్ష్మణ్‌..  ఇదే విషయంపై అనిశా అధికారులకు ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిపై నిఘా ఉంచిన అనిశా లక్ష్మణ్‌ డబ్బులిస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.IMG_20240407_131841

Views: 54
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపాధి కూలీలతో పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఉపాధి కూలీలతో పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు
  మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మండలం లోని సోమారం, గుర్తూరు, కంఠయపాలెం, మడిపల్లి గ్రామాల్లోని చెరువుల వద్దకి వెళ్లి ఉపాధి కూలీలతో పనిచేస్తూ ఓటు అడిగిన మాజీ
తొర్రూరు లో యంపీ ఎలక్షన్స్ బీ ఆర్ యస్ ప్రచారం... కార్నర్ మీటింగ్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌కు మధ్యంతర బెయిల్
సామ్యవాద సాకారానికి పాటు పడిన సమాజ సంస్కర్త బసవేశ్వరుడు
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి
మోడీ దేశాన్ని అమ్మకానికి పెడుతాడు....  బిజెపి పాలన రాక్షస పాలన....