వేసవిలో ఆయిల్ ఫామ్ తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆయిల్ పామ్ నర్సరీ మరియు క్షేత్ర పర్యటన జిల్లా ఉద్యాన అధికారి శ్రీ జీనుగు మరియాన్న

వేసవిలో ఆయిల్ ఫామ్ తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈరోజు హరిపిరాల ఆయిల్ పామ్ నర్సరీ మరియు క్షేత్ర పర్యటన జిల్లా ఉద్యాన అధికారి శ్రీ జీనుగు మరియాన్నIMG-20240429-WA0045  జిల్లాలో ఉన్న ఉద్యాన అధికారులు ఆయిల్ ఫెడ్ అధికారులు బిందు సేద్య ప్రతినిధులు తో కలిసి వేసవిలో ఆయిల్ ఫామ్ తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా 
1. ఆయిల్ పంప్ చెట్ల చుట్టూ జనుము రెండు వరుసగా వేసుకోవాలి 
2. మల్చింగ్ విధానాన్ని అనుసరించాలి 
3. ఉదయం 9 గంటల లోపు బిందు సేద్యం ద్వారా మొక్కలకు నీళ్లు ఇచ్చినట్లయితే ఎండ వీడిని తట్టుకుంటుంది 
4. ఎరువులను బిందు సేద్యం ద్వారా నీటిలో కరిగిపించి పంపినప్పుడు ఖర్చు తగ్గుతుంది మరియు మొక్కకు పూర్తిగా ఎరువులు అందుతాయి. 
దీనితోపాటు ఆయిల్ పామ్ నర్సరీలో రిజిస్టర్లను తనిఖీ చేయడం నాణ్యతలేని ఆల్ఫా మొక్కలను కల్లింగ్ విధానం ద్వారా నిర్మూలించడం మరియు వచ్చే వానా కాలానికి మొక్కలు సరఫరకు సిద్ధంగా ఉండాలని నర్సరీ యజమానులకు సూచించారు ప్రస్తుతం నర్సరీలో 3,40,000 మొక్కలు అందుబాటులో ఉన్నాయి ఇవి మనకు ఆరు నుంచి ఏడు వేల ఎకరాలకు సరిపోయే విధంగా ఉన్నాయి కావున ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు తొందరగా నమోదు చేయవలసిందిగా ఉద్యాన అధికారులను క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారులు రాకేష్, విష్ణు, అనితా శ్రి, అరుణ్,రాములు పాల్గొన్నారు.

Views: 99
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం...
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం