మధుయాష్కి గౌడ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..

On
మధుయాష్కి గౌడ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..

మధుయాష్కి గౌడ్ కు

IMG-20240505-WA0119
మధుయాష్కి కారు ప్రమాదం జరిగిన దృశ్యం..

తృటిలో తప్పిన ప్రమాదం..

ఎల్బీనగర్, మే 05 (న్యూస్ ఇండియా ప్రతినిధి): టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. అనుకోకుండా అడ్డువచ్చిన  బైకును తప్పించే క్రమంలో.. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు టైర్లు పేలిపోయి భారీ కుదుపునకు గురైనప్పటికీ.. డ్రైవర్ ముఖేష్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. మాజీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ తల్లి మరణించడంతో.. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు  ఆదివారం ఉదయమే మధుయాష్కి గౌడ్ గారు  వరంగల్ బయలుదేరారు. ఈ క్రమంలో ఆలేరు వద్దకు వెళ్ళగానే బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తులు రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అనుకోకుండా  అడ్డుగా వచ్చారు. బైక్ పై ఉన్న ఆ వ్యక్తులను కాపాడే క్రమంలో.. కారును డ్రైవర్ పక్కకు తిప్పగా  డివైడర్ను ఢీ కొట్టి కారు టైర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో  మధుయాష్కి గౌడ్, కారులోని ఇతరులకు స్వల్ప గాయాలు మినహా ప్రాణాపాయం తప్పడంతో .. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 'దేవుడి దయవల్ల స్వల్ప గాయాలు మినహా  ఎవరికి ఏమి కాలేదు ' అని మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.

Views: 12

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక