మధుయాష్కి గౌడ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..

On
మధుయాష్కి గౌడ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..

మధుయాష్కి గౌడ్ కు

IMG-20240505-WA0119
మధుయాష్కి కారు ప్రమాదం జరిగిన దృశ్యం..

తృటిలో తప్పిన ప్రమాదం..

ఎల్బీనగర్, మే 05 (న్యూస్ ఇండియా ప్రతినిధి): టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. అనుకోకుండా అడ్డువచ్చిన  బైకును తప్పించే క్రమంలో.. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు టైర్లు పేలిపోయి భారీ కుదుపునకు గురైనప్పటికీ.. డ్రైవర్ ముఖేష్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. మాజీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ తల్లి మరణించడంతో.. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు  ఆదివారం ఉదయమే మధుయాష్కి గౌడ్ గారు  వరంగల్ బయలుదేరారు. ఈ క్రమంలో ఆలేరు వద్దకు వెళ్ళగానే బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తులు రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అనుకోకుండా  అడ్డుగా వచ్చారు. బైక్ పై ఉన్న ఆ వ్యక్తులను కాపాడే క్రమంలో.. కారును డ్రైవర్ పక్కకు తిప్పగా  డివైడర్ను ఢీ కొట్టి కారు టైర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో  మధుయాష్కి గౌడ్, కారులోని ఇతరులకు స్వల్ప గాయాలు మినహా ప్రాణాపాయం తప్పడంతో .. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 'దేవుడి దయవల్ల స్వల్ప గాయాలు మినహా  ఎవరికి ఏమి కాలేదు ' అని మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.

Views: 24

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
*ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం*  జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునుతుల గ్రామంలో  తెలంగాణ సాధన కోసం  సాగిన స్ఫూర్తిని అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ...
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu