వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ  ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశం

బిజెపి పాలకుర్తి నియోజకవర్గ  కన్వీనర్ పూసల శ్రీమాన్

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ  ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశం

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ  ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశం


మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బిజెపి కార్యాలయంలో సోమవారం బిజెపి పాలకుర్తి నియోజకవర్గ  కన్వీనర్ పూసల శ్రీమాన్ ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కటేపల్లి వెంకటరమణ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బిజెపి పార్టీ వరంగల్ ఖమ్మం మరియు నల్గొండ  ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గెలుపు కొరకు ప్రతి ఒక బిజెపి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిస్తూ పట్టభద్రులను ఓటు అడిగే హక్కు కేవలం బిజెపి పార్టీకే ఉందంటూ కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీలు  నిరుద్యోగులను పూర్తిగా విస్మరించాయని పేర్కొంటూ  ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో ఈ రెండు పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయనీ వారికి పట్టభద్రుల ఓటును అడిగే అర్హత లేదని అంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల కోసం ఉద్యమిస్తూ నోటిఫికేషన్ల విడుదల కోసం కృషి ఇస్తానని చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 83
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం  ఏటుకూరి మునేశ్వరావు వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
ఖమ్మం ఫిబ్రవరి 28 ఖమ్మం న్యూస్: ఆర్‌.ఎం.పీ డాక్టర్‌గా ప్రజలకు అపార సేవలందించిన వనంవారి కృష్ణాపురం మహనీయుడు ఏటుకూరి మునేశ్వరావు పెద్ద కర్మ శనివారం రోజున జరిగింది...
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..
ఇంటర్ ఎగ్జామ్స్.., సెంటర్ అడ్రస్ కోసం ఇలా చేయండి!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ 
కార్పొరేషన్లో ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు
సౌత్ సెంట్రల్ అగ్నిమాపక భద్రతా స్పెషల్ డ్రైవ్‌ 
క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుంది.