వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ  ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశం

బిజెపి పాలకుర్తి నియోజకవర్గ  కన్వీనర్ పూసల శ్రీమాన్

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ  ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశం

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ  ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశం


మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బిజెపి కార్యాలయంలో సోమవారం బిజెపి పాలకుర్తి నియోజకవర్గ  కన్వీనర్ పూసల శ్రీమాన్ ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కటేపల్లి వెంకటరమణ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బిజెపి పార్టీ వరంగల్ ఖమ్మం మరియు నల్గొండ  ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గెలుపు కొరకు ప్రతి ఒక బిజెపి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిస్తూ పట్టభద్రులను ఓటు అడిగే హక్కు కేవలం బిజెపి పార్టీకే ఉందంటూ కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీలు  నిరుద్యోగులను పూర్తిగా విస్మరించాయని పేర్కొంటూ  ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో ఈ రెండు పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయనీ వారికి పట్టభద్రుల ఓటును అడిగే అర్హత లేదని అంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల కోసం ఉద్యమిస్తూ నోటిఫికేషన్ల విడుదల కోసం కృషి ఇస్తానని చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 85
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు సెంటర్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఐదు గొర్లు, రెండు...
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం
మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..