వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ  ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశం

బిజెపి పాలకుర్తి నియోజకవర్గ  కన్వీనర్ పూసల శ్రీమాన్

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ  ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశం

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ  ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశం


మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బిజెపి కార్యాలయంలో సోమవారం బిజెపి పాలకుర్తి నియోజకవర్గ  కన్వీనర్ పూసల శ్రీమాన్ ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కటేపల్లి వెంకటరమణ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బిజెపి పార్టీ వరంగల్ ఖమ్మం మరియు నల్గొండ  ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గెలుపు కొరకు ప్రతి ఒక బిజెపి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిస్తూ పట్టభద్రులను ఓటు అడిగే హక్కు కేవలం బిజెపి పార్టీకే ఉందంటూ కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీలు  నిరుద్యోగులను పూర్తిగా విస్మరించాయని పేర్కొంటూ  ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో ఈ రెండు పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయనీ వారికి పట్టభద్రుల ఓటును అడిగే అర్హత లేదని అంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల కోసం ఉద్యమిస్తూ నోటిఫికేషన్ల విడుదల కోసం కృషి ఇస్తానని చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 85
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, ఆగస్టు 13: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం భీముని తండాలో గుడుంబా తయారీ, విక్రయాలపై తొర్రూరు పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున...
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి
కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ జైలు భరో
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు