పట్టభద్రుల ఓటు....... పట్టుకోండి 500 నోటు

పట్టభద్రుల ఓటు....... పట్టుకోండి 500 నోటు

మేధావులను చట్టసభల్లోకి పంపించాలని మేధావులు వినియోగించే ఓటు ధర రూ. 500 తో ముగుస్తుంది. ఎమ్మెల్సీ ఓట్ల సందర్భంగా తోరూర్ మండలం లో ఓట్ల రేట్లు రూ.500 కు ఫిక్స్ అయ్యాయి. దీంతో అధికార ప్రతిపక్ష నాయకులు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎలాగైనా ఓట్లు సాధించాలనే లక్ష్యంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఓటుకు రూ.5 వందల చొప్పున పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు సమీపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, దుబ్బ తండా సమీపంలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఉదయం నుంచి పోలింగ్ ముగిసేంత వరకు గ్రాడ్యుయేట్ ఓటర్లకు యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేశారు. పోల్ చిట్టీలతో డబ్బుల కోసం ఓటర్ల బారులు తీరారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మేధావులుగా చెప్పుకునే మేధావి వర్గాలు నోటు తీసుకున్న తర్వాతే ఓటుకు వెళ్లడం గమనార్హం. బహిర్గతంగా ఇంత జరుగుతున్న ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా చూసే జనం దిగ్బ్రాంతి చెందుతున్నారు.IMG-20240527-WA0110

Views: 196
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి