పట్టభద్రుల ఓటు....... పట్టుకోండి 500 నోటు

పట్టభద్రుల ఓటు....... పట్టుకోండి 500 నోటు

మేధావులను చట్టసభల్లోకి పంపించాలని మేధావులు వినియోగించే ఓటు ధర రూ. 500 తో ముగుస్తుంది. ఎమ్మెల్సీ ఓట్ల సందర్భంగా తోరూర్ మండలం లో ఓట్ల రేట్లు రూ.500 కు ఫిక్స్ అయ్యాయి. దీంతో అధికార ప్రతిపక్ష నాయకులు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎలాగైనా ఓట్లు సాధించాలనే లక్ష్యంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఓటుకు రూ.5 వందల చొప్పున పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు సమీపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, దుబ్బ తండా సమీపంలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఉదయం నుంచి పోలింగ్ ముగిసేంత వరకు గ్రాడ్యుయేట్ ఓటర్లకు యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేశారు. పోల్ చిట్టీలతో డబ్బుల కోసం ఓటర్ల బారులు తీరారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మేధావులుగా చెప్పుకునే మేధావి వర్గాలు నోటు తీసుకున్న తర్వాతే ఓటుకు వెళ్లడం గమనార్హం. బహిర్గతంగా ఇంత జరుగుతున్న ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా చూసే జనం దిగ్బ్రాంతి చెందుతున్నారు.IMG-20240527-WA0110

Views: 205
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
మహబూబాబాద్ జిల్ల తొర్రూరు మండలంలోని 60 గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపనఅధికారులకు ఎమ్మెల్యే గట్టి హెచ్చరిక – ఆగిన పనులు వెంటనే...
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం
మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..
పటాన్ చెరు రియల్ ఎస్టేట్‌లో ఊహించని మార్పులు.. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పెట్టుబడికి ఇదే సరైన సమయమా?
రోజుకు కేవలం ₹67 పెట్టుబడి.. భవిష్యత్తులో ₹1 కోటి సంపద సాధ్యమేనా? SIP సీక్రెట్ ఇదే!
హైదరాబాద్ టు అమరావతి జెట్ స్పీడ్!.. RRR, 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కీలక ముందడుగు