జనగామకి తగ్గించిన ఆర్టీసీ RTC బస్సులు
ఉప్పల్ డిపో నుండి స్వర్ణగిరి భువనగిరి, యాదగిరి గుట్టకి మళ్లింపు
బస్సులు సరిపోక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు
*ప్రభుత్వం వెంటనే స్పందించి బస్సులు మంజూరు చేయాలని కోరుతున్నా ప్రయాణికులు
న్యూస్ ఇండియా తెలుగు జూన్ 17 ( తెలంగాణ బ్యూరో రిపోర్టర్ వెంకన్న గౌడ్ )
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం అందరూ హర్షించదగ్గ విషయమే కానీ కొన్ని పొరపాట్లు వల్ల ప్రయాణికులు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉప్పల్ డిపో ఏమ్ జీ బీ ఎస్, కూకట్పల్లి డిపో నుండి జనగామ కి వెళ్లవలసిన బస్సులను తగ్గించి కొత్తగా స్వర్ణగిరి భువనగిరి యాదగిరిగుట్టకు అధికారులు మళ్ళించారు. దీనివల్ల జనగామ కు వెళ్లాల్సిన బస్సులు తగ్గిపోవడంతో ఉన్న తక్కువ బస్సులను ఎక్కెందుకు జనాలు ఎగబడ్డారు ముసలోడు వృద్ధులు మహిళలు బస్సులు ఎక్కలేక రోడ్డుపై నిలబడ్డారు ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి జనగామ కు ఇదివరకు ఉండే బస్సులను మంజూరు చేయవలసిందిగా ప్రయాణికులు వేడుకుంటున్నారు.
Comment List