తప్పుడు ధ్రువ పత్రాలతో పీఈటి ఉద్యోగం

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పిఈ టిగా విధులు

On
తప్పుడు ధ్రువ పత్రాలతో పీఈటి ఉద్యోగం

విధుల నుండి తొలగించాలని తుడుం దెబ్బ డిమాండ్

తప్పుడు ధ్రువ పత్రాలతో పీఈటి ఉద్యోగం. 

*కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పిఈ

Screenshot_20240613_191550_Gallery
తప్పుడు దృవపత్రాలతో పీఈటి ఉద్యోగం.

టిగా విధులు. 
*13 సంవత్సరాలు గా జాటోత్ రజిత విధులు.
*విధుల నుండి తొలగించాలని తుడుం దెబ్బ డిమాండ్.

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

Read More మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..

మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఓ ఉద్యోగి తప్పుడు దృవపత్రాలతో పీఈటి గా గత 13 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నదని పత్రికా ప్రకటనలో మహబూబాబాద్ జిల్లా తుడుం దెబ్బ అధ్యక్షులు బొల్లి సారయ్య ఆరోపించారు. గూడూరు మండలం బ్రాహ్మణ పెళ్లి గ్రామంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ఉన్నది. అయితే గతంలో కస్తూరిబాలో ఉపాధ్యాయులను, పీఈటీ ని రిక్రూట్మెంట్ చేసుకున్నారు. సరైన విద్యా అర్హతలు, పత్రాలు లేకుండా 13 సంవత్సరాల నుండి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పీఈటిగా ఉద్యోగం చేస్తూ అందర్నీ నమ్మించి ప్రభుత్వ సొమ్మును కాజేసిందని తుడుందెబ్బ ఆరోపిస్తూ ఉద్యోగం చేయాలంటే వయసు కూడా సరిపోవాలని, ప్రభుత్వాలను మోసం చేస్తూ వస్తున్నదని, గత 13 సంవత్సరాల క్రితం జాటోత్ రజితకు సరైన వయసు లేదని ఆమె సరైన పత్రాలు కూడా తన దగ్గర లేవని తప్పుడు పత్రాలు సృష్టించి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉద్యోగం సంపాదించిందని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు బొల్లి సారయ్య తుడుం దెబ్బ సమావేశంలో ఆమెపై ఆరోపణలు చేశారు. ఇకనైనా అధికారులు దృష్టి సారించి జాటోతు రజిత ను వెంటనే విధుల్లో నుండి తొలగించి  చదువులో రాణించిన వారికి ఉద్యోగం కల్పించాలని, జాటోత్ రజిత ను తొలగించని ఎడల తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని తుడుందెబ్బ కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు పట్టుదలతో కృషితో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ప్రిన్సిపల్ సునీతకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు బోల్లి సారయ్య, నాయకులు బత్తుల రామన్న, పూనేం యాకయ్య, ఈసం గణేష్, పూనేం మునేందర్, పూనేం చిన్న వీరస్వామి, పోనేం సురేష్, ఆగబోయిన చంద్రం, పునేం లోకేష్, రాజు, సాయి, వరుణ్ లు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
ఖమ్మం మార్చి 4 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ఖమ్మం ప్రకాష్ నగర్28వ డివిజన్ కార్పొరేటర్ గజ్జెల లక్ష్మీవెంకన్న ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్...
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి