ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి - టిడిపి నాయకులు

On

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తలు ఉద్యోగస్తులు కావున విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా అంకితభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలుగుదేశం నాయకులు నాగరాజు గౌడ్, దేశాయి మాధవరావు దేశాయి,దేశాయి గురు రాజారావు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పుష్పావతి లు తెలిపారు. గురువారం మండల కేంద్రమైన నందవరం వెలుగు సిబ్బంది నందవరం మండల తెలుగుదేశం నాయకులు దేశాయి గురు రాజారావు, దేశాయి మాధవరావు, నాగరాజ్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పుష్పావతి లను కలిసి బొక్కెన, శాలువా పూలమాలలతో శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలుగు సిబ్బంది సమస్యలు ఉన్నయెడల తమ దృష్టికి తెస్తే తమ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు దేశాయి మాధవరావు, దేశాయి గురు రాజారావు ,నాగరాజ్ గౌడ్ ,జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పుష్పవతి, వెలుగు సిబ్బంది అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ చిన్న వీరన్న, సీసీలు జనార్ధన్, షబానా ,గ్రామైక్య సంఘ సహాయకులు( వి ఓ ఏ) శారదా దేవి, ఆనందు, భాగ్యమ్మ ,ఆదిలక్ష్మి ,సురేష్ త్రివేణి, గాయత్రి, నాగరత్నమ్మ, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Views: 22
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు సెంటర్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఐదు గొర్లు, రెండు...
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం
మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..