ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి - టిడిపి నాయకులు

By Khasim
On

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తలు ఉద్యోగస్తులు కావున విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా అంకితభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలుగుదేశం నాయకులు నాగరాజు గౌడ్, దేశాయి మాధవరావు దేశాయి,దేశాయి గురు రాజారావు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పుష్పావతి లు తెలిపారు. గురువారం మండల కేంద్రమైన నందవరం వెలుగు సిబ్బంది నందవరం మండల తెలుగుదేశం నాయకులు దేశాయి గురు రాజారావు, దేశాయి మాధవరావు, నాగరాజ్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పుష్పావతి లను కలిసి బొక్కెన, శాలువా పూలమాలలతో శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలుగు సిబ్బంది సమస్యలు ఉన్నయెడల తమ దృష్టికి తెస్తే తమ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు దేశాయి మాధవరావు, దేశాయి గురు రాజారావు ,నాగరాజ్ గౌడ్ ,జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పుష్పవతి, వెలుగు సిబ్బంది అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ చిన్న వీరన్న, సీసీలు జనార్ధన్, షబానా ,గ్రామైక్య సంఘ సహాయకులు( వి ఓ ఏ) శారదా దేవి, ఆనందు, భాగ్యమ్మ ,ఆదిలక్ష్మి ,సురేష్ త్రివేణి, గాయత్రి, నాగరత్నమ్మ, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Views: 14
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

యువత ప్రశ్నించడం అలవర్చుకోవాలి.. యువత ప్రశ్నించడం అలవర్చుకోవాలి..
యువత ప్రశ్నించడం అలవర్చుకోవాలి.. యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ లో మధుయాష్కి గౌడ్.. యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ లో ప్రసంగిస్తున్న మధుయాష్కి గౌడ్.. హైదరాబాద్, మార్చి 29, న్యూస్...
చౌళ్ళరామారం లో సీతారాముల కళ్యాణం ఘనంగా..
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్
మీర్ఖాన్‌పేటలో అంగరంగ వైభవంగా సీతారాముల రథోత్సవం.
కళ్యాణ మహోత్సవం
కొత్తగూడెంలో శ్రీ రామ నవమి సందర్భంగా అన్నదానం
రామభక్తిని చాటుకున్న శ్రీరామ భక్తులు