మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్

ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి

On

 

 

 

IMG-20240718-WA1188IMG-20240718-WA1188

Read More భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..

చుంచుపల్లి  (న్యూస్ ఇండియా నరేష్) జూలై 18: చెడు అలవాట్లతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్, చుంచుపల్లి సి. ఐ రాయల వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు శ్రీ చైతన్య హైస్కూల్ విద్యార్థులతో గురువారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగంతో పిల్లల భవిష్యత్‌ అంధకారంగా మారుతుందని, వాటికి దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్‌ నాశనమవుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్ళను చేయాలనే ఆశతో ఉంటే కొంత మంది యువత డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. మత్తు పదార్దాల వల్ల జరిగే అనర్దాలను విద్యార్థులు తమ తల్లితండ్రులకు వివరించాలని, మత్తు పదార్దాలకు సంబందించిన సమాచారం తెలిస్తే సమీపంలో పోలీస్‌ వారికి తెలియజేయాలని సూచించారు.

Views: 107
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

సింగరేణిలో వ్రాత పరీక్షలు సింగరేణిలో వ్రాత పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత...
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..