ఫత్తేపురంలో క్షుద్ర పూజల కలకలం

పూజలో మహిళ పుస్తె మెట్టెలు దుస్తువులు... •ఈ క్షుద్ర పూజలో జంతువును బలి...

ఫత్తేపురంలో క్షుద్ర పూజల కలకలం

భూ వివాదాల నేపథ్యంలో చేయించినవే తొరూర్ ఎస్ఐ కూచిపూడి జగదీష్IMG-20240731-WA0002

క్షుద్ర పూజల కలకలంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫత్తేపురం గ్రామ శివారులోని జామాయిల్ తోటలో క్షుత్రపూజలు జరిగిన ఆనవాలు ఉన్నాయి. తోటలోకి వెళ్లిన పలువురు యువకులు అక్కడి దృశ్యాలను చిత్రీకరించి గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు. అసలు ఆ తోటలో ఎందుకోసం పూజలు జరిగాయి, ఏం జరిగిందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ పూజలో ఓ మహిళా దుస్తువులు, మట్టెలు, కమ్మలు, పుత్తెలు, నిమ్మకాయలు, రెండు కత్తులు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అక్కడే ఓ జంతువును భలి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గ్రామ ప్రజలు నిత్యం కొలిచే బాలమైసమ్మ దేవాలయం సమీపంలో జరుగడంతో ప్రజలు దేవాలయం సమీపంలో ఇలాంటి పూజలు,ఏమిటని చర్చించుకుంటున్నారు. ఈ విషయం పై తొర్రూరు ఎస్సై కూచిపూడి జగదీష్ వివరణ కోరగా... జమాల్ తోట పక్కన ఉన్న స్థలము 65 లక్షలకు అమ్మకానికి ఉండడంతో అట్టి స్థలము అమ్ముడు పోకూడదని ఇలాంటి క్షుద్ర పూజలకు పాల్పడ్డారని తెలిపారు. అదేవిధంగా ఇలాంటి అవరోధాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.

Views: 152
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.