ఫత్తేపురంలో క్షుద్ర పూజల కలకలం

పూజలో మహిళ పుస్తె మెట్టెలు దుస్తువులు... •ఈ క్షుద్ర పూజలో జంతువును బలి...

ఫత్తేపురంలో క్షుద్ర పూజల కలకలం

భూ వివాదాల నేపథ్యంలో చేయించినవే తొరూర్ ఎస్ఐ కూచిపూడి జగదీష్IMG-20240731-WA0002

క్షుద్ర పూజల కలకలంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫత్తేపురం గ్రామ శివారులోని జామాయిల్ తోటలో క్షుత్రపూజలు జరిగిన ఆనవాలు ఉన్నాయి. తోటలోకి వెళ్లిన పలువురు యువకులు అక్కడి దృశ్యాలను చిత్రీకరించి గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు. అసలు ఆ తోటలో ఎందుకోసం పూజలు జరిగాయి, ఏం జరిగిందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ పూజలో ఓ మహిళా దుస్తువులు, మట్టెలు, కమ్మలు, పుత్తెలు, నిమ్మకాయలు, రెండు కత్తులు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అక్కడే ఓ జంతువును భలి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గ్రామ ప్రజలు నిత్యం కొలిచే బాలమైసమ్మ దేవాలయం సమీపంలో జరుగడంతో ప్రజలు దేవాలయం సమీపంలో ఇలాంటి పూజలు,ఏమిటని చర్చించుకుంటున్నారు. ఈ విషయం పై తొర్రూరు ఎస్సై కూచిపూడి జగదీష్ వివరణ కోరగా... జమాల్ తోట పక్కన ఉన్న స్థలము 65 లక్షలకు అమ్మకానికి ఉండడంతో అట్టి స్థలము అమ్ముడు పోకూడదని ఇలాంటి క్షుద్ర పూజలకు పాల్పడ్డారని తెలిపారు. అదేవిధంగా ఇలాంటి అవరోధాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.

Views: 152
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..