ఫత్తేపురంలో క్షుద్ర పూజల కలకలం

పూజలో మహిళ పుస్తె మెట్టెలు దుస్తువులు... •ఈ క్షుద్ర పూజలో జంతువును బలి...

ఫత్తేపురంలో క్షుద్ర పూజల కలకలం

భూ వివాదాల నేపథ్యంలో చేయించినవే తొరూర్ ఎస్ఐ కూచిపూడి జగదీష్IMG-20240731-WA0002

క్షుద్ర పూజల కలకలంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫత్తేపురం గ్రామ శివారులోని జామాయిల్ తోటలో క్షుత్రపూజలు జరిగిన ఆనవాలు ఉన్నాయి. తోటలోకి వెళ్లిన పలువురు యువకులు అక్కడి దృశ్యాలను చిత్రీకరించి గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు. అసలు ఆ తోటలో ఎందుకోసం పూజలు జరిగాయి, ఏం జరిగిందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ పూజలో ఓ మహిళా దుస్తువులు, మట్టెలు, కమ్మలు, పుత్తెలు, నిమ్మకాయలు, రెండు కత్తులు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అక్కడే ఓ జంతువును భలి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గ్రామ ప్రజలు నిత్యం కొలిచే బాలమైసమ్మ దేవాలయం సమీపంలో జరుగడంతో ప్రజలు దేవాలయం సమీపంలో ఇలాంటి పూజలు,ఏమిటని చర్చించుకుంటున్నారు. ఈ విషయం పై తొర్రూరు ఎస్సై కూచిపూడి జగదీష్ వివరణ కోరగా... జమాల్ తోట పక్కన ఉన్న స్థలము 65 లక్షలకు అమ్మకానికి ఉండడంతో అట్టి స్థలము అమ్ముడు పోకూడదని ఇలాంటి క్షుద్ర పూజలకు పాల్పడ్డారని తెలిపారు. అదేవిధంగా ఇలాంటి అవరోధాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.

Views: 152
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక