ఫత్తేపురంలో క్షుద్ర పూజల కలకలం

పూజలో మహిళ పుస్తె మెట్టెలు దుస్తువులు... •ఈ క్షుద్ర పూజలో జంతువును బలి...

ఫత్తేపురంలో క్షుద్ర పూజల కలకలం

భూ వివాదాల నేపథ్యంలో చేయించినవే తొరూర్ ఎస్ఐ కూచిపూడి జగదీష్IMG-20240731-WA0002

క్షుద్ర పూజల కలకలంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫత్తేపురం గ్రామ శివారులోని జామాయిల్ తోటలో క్షుత్రపూజలు జరిగిన ఆనవాలు ఉన్నాయి. తోటలోకి వెళ్లిన పలువురు యువకులు అక్కడి దృశ్యాలను చిత్రీకరించి గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు. అసలు ఆ తోటలో ఎందుకోసం పూజలు జరిగాయి, ఏం జరిగిందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ పూజలో ఓ మహిళా దుస్తువులు, మట్టెలు, కమ్మలు, పుత్తెలు, నిమ్మకాయలు, రెండు కత్తులు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అక్కడే ఓ జంతువును భలి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గ్రామ ప్రజలు నిత్యం కొలిచే బాలమైసమ్మ దేవాలయం సమీపంలో జరుగడంతో ప్రజలు దేవాలయం సమీపంలో ఇలాంటి పూజలు,ఏమిటని చర్చించుకుంటున్నారు. ఈ విషయం పై తొర్రూరు ఎస్సై కూచిపూడి జగదీష్ వివరణ కోరగా... జమాల్ తోట పక్కన ఉన్న స్థలము 65 లక్షలకు అమ్మకానికి ఉండడంతో అట్టి స్థలము అమ్ముడు పోకూడదని ఇలాంటి క్షుద్ర పూజలకు పాల్పడ్డారని తెలిపారు. అదేవిధంగా ఇలాంటి అవరోధాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.

Views: 152
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం  మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్  కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు