లక్ష్మీదేవిపల్లి మండలం ప్రజా పరిషత్ వీడ్కోల సమావేశం

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని

On

లక్ష్మీదేవిపల్లి(న్యూస్ఇండియా)ఆగస్టు9:లక్ష్మీదేవిపల్లి మండలం ప్రజా పరిషత్ లొని సభ్యుల పదవి కాలం ఆగస్టు 6తో ముగియడంతో శుక్రవారం వీడ్కోల కార్యక్రమం నిర్వహించారు.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు పరిపాలన అందించిన జడ్పిటిసి ఎంపీటీసీలు పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు ఎప్పుడు మీ సేవలు ఉండాలన్నారు. ప్రశాంత జీవితం గడపండి, అవకాశం వస్తే మళ్లీ రాజకీయాలు రాణించండి, అవకాశం రాకపోతే గ్రామానికి సేవ  అందించడి ఆని తెలిపారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే కూనంనేనిIMG20240809155143 సాంబశివరావు ఎంపీటీసీలును శాలువాతో సన్మానించి , జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, ఎంపీడీవో చలపతిరావు, ఎంపీపీ భూక్యా సోనా , ఎమ్మార్వో కె ఆర్ కె వి ప్రసాద్,   జెడ్పిటిసి మేరెడ్డి వసంత , మండల కో ఆప్షన్స్ సభ్యులు జక్కుల సుందర్, భూక్యా స్వాతి, కొమరం లలిత, ముక్కెర శిరీష, నునావత్ గోవింద్, తేజావత్ భద్రమ్మ, గుర్రాల బాబురావు, కుంజ రాంబాబు సూపర్డెంట్ టీ. అంకుబాబు , ఏఈలు వెంకటస్వామి, శివ లాల్ ,మండల కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.

Views: 55
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం.. భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..   ‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో తెలంగాణకు కొత్త దిశ..   ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం...
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ