గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతులు తీసుకోవాలి

లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి

On

IMG-20240904-WA1301 లక్ష్మీదేవిపల్లి(న్యూస్ ఇండియన్)సెప్టెంబర్3: లక్ష్మీదేవిపల్లి మండలంలోని గణేష్ మండపాల నిర్వాహకులు ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవాలని లక్ష్మిదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి బుధవారం తెలిపారు . ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ లక్ష్మీదేవిపల్లి మండలం పరిధిలో గల గణేష్ మండపాల నిర్వహకులు తప్పనిసరిగా పోలీస్ అనుమతులు తీసుకోవడంతో పాటు , ప్రతిమ ఎత్తు, ప్రదేశం, నిమజ్జనం తేదీ, మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ పూర్తి వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు . అదే విధంగా విద్యుత్ శాఖ అనుమతితో మండపాల వద్ద విద్యుత్ ని వినియోగించుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మండప నిర్వహకులు ,ఫోన్ నెంబర్ గాల ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదన్నారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు.వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు చేసుకునేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానం అమలులోకి తెచ్చిందన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Views: 39
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

మైనింగ్ మాయాజాలం.. మైనింగ్ మాయాజాలం..
మైనింగ్ మాయాజాలం.. ఎస్వి కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ నుండి అక్రమంగా మట్టి తరలింపు పోలీసులు లారీలను పట్టుకున్నాక వే బిల్లులు జనరేట్ చేసిన మట్టి మాఫియా రంగారెడ్డి...
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం
“గోల్డ్ తగ్గించండి”.. మోదీ విజ్ఞప్తి వెనుక దేశాన్ని కుదిపే ఎకనామిక్ టెన్షన్!
కాంగ్రెస్ నాయకులు పావని-వెంకన్న ఇంటికి ఎమ్మెల్యే రామచంద్రనాయక్
సెండ్ యువర్ ప్రొఫైల్… “మాచన”కు యు.ఎన్.ఓ సూచన..
పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా