గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతులు తీసుకోవాలి

లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి

On

IMG-20240904-WA1301 లక్ష్మీదేవిపల్లి(న్యూస్ ఇండియన్)సెప్టెంబర్3: లక్ష్మీదేవిపల్లి మండలంలోని గణేష్ మండపాల నిర్వాహకులు ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవాలని లక్ష్మిదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి బుధవారం తెలిపారు . ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ లక్ష్మీదేవిపల్లి మండలం పరిధిలో గల గణేష్ మండపాల నిర్వహకులు తప్పనిసరిగా పోలీస్ అనుమతులు తీసుకోవడంతో పాటు , ప్రతిమ ఎత్తు, ప్రదేశం, నిమజ్జనం తేదీ, మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ పూర్తి వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు . అదే విధంగా విద్యుత్ శాఖ అనుమతితో మండపాల వద్ద విద్యుత్ ని వినియోగించుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మండప నిర్వహకులు ,ఫోన్ నెంబర్ గాల ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదన్నారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు.వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు చేసుకునేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానం అమలులోకి తెచ్చిందన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Views: 26
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్ గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
ఖమ్మం మార్చి 17 ఖమ్మం న్యూస్ ప్రతినిధి రఘునాధపాలెం మండలం మంగ్యతండా గ్రామానికి చెందిన మాలోత్ భార్గవి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. గతంలో...
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు 
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్