ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పై పొక్సో కేసు నమోదు..!

On
ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పై పొక్సో కేసు నమోదు..!

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 24 :- సమాజంలో ఆదర్శంగా ఉండి, మంచి పౌరులను తీర్చి దిద్దాల్సిన హెడ్ మాస్టర్ వక్రమార్గంలో నడుస్తున్నాడు. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థుల పాలిట కీచకుడిలా మారి నీచంగా ప్రవర్తిస్తున్న హెడ్ మాస్టర్. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మండల కేంద్రమైన పెద్దకడుబూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఆది ఆంధ్ర) నందు హెడ్ మాస్టర్ గా కె.సుప్రసాద్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల హెడ్ మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అసభ్యకర వీడియోలను చూపిస్తున్నాడని, చాలా కాలంగా పాఠశాలలో చదుతున్న విద్యార్థులపై ఆయన ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని మండలంలోని ఎంఈఓ ఎస్.సువర్ణలా సునియమ్ కు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం ఎంఈఓ సదరు హెడ్ మాస్టర్ విషయమును గురించి విచారించుకుని పెద్దకడుబూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఎంఈఓ ఫిర్యాదు మేరకు ఎస్ఐ విచారణ అనంతరం పోలీస్ స్టేషన్ లో హెడ్ మాస్టర్ పై పొక్సో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడమైనదని ఎస్ఐ నిరంజన్ రెడ్డి విలేకరులకు తెలిపారు.pocso-2

Views: 60
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం. సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం.
కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైభారత్ ద్వారా వికసిత భారత్ పాదయాత్రలను నిర్వహించనుంది.ఈ వినూత్న కార్యక్రమం ద్వారా భారతదేశం యొక్క...
మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన హరగోపాల్ గౌడ్ సాయి గణేష్
ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికీ కంటిచూపు
సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ రవీందర్‌ పై సస్పెన్షన్ వేటు..
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన: ముత్యాల రాజశేఖర్ రావు..
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
ఖమ్మం నగర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ