డ్రగ్స్ నిర్మూలించడం అందరి బాధ్యత
కొత్తగూడెం వన్ టౌన్ సీఐ కరుణాకర్
On
సమాచారం తెలపడానికి 100కు డయల్ చేయండి
కొత్తగూడెం ( న్యూస్ ఇండియానరేష్) సెప్టెంబర్ 25: ఎస్పీ రోహిత్ రాజు, డీఎస్పీ రెహమాన్ ఆదేశాల మేరకు వన్టౌన్ సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ ఆవరణ వద్ద డ్రగ్స్ నిర్మూలనపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలించడం అందరి బాధ్యత అని , డ్రగ్స్ వల్ల యువత పెడదారి పడుతుందని, డ్రగ్స్ అరికట్టకపోతే మనమే బాధితులం అవుతామని అన్నారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం పోలీస్ వారికి తెలపడం కోసం 100కు డయల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, సిబ్బంది కిషన్, చారి ,సలీం, బిక్షపతి పాల్గొన్నారు.
Views: 26
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Jul 2025 17:33:53
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై 06, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగ, మురళీకృష్ణ ఆలయం వెళ్లే దారిలో ఆర్చ్...
Comment List