మాదాసి-మదారి కురువల హక్కులపై పార్లమెంట్ లో చర్చించాలని ఎంపి కి వినతి.

On
మాదాసి-మదారి కురువల హక్కులపై పార్లమెంట్ లో చర్చించాలని ఎంపి కి వినతి.

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 25:- మండల కేంద్రమైన పెద్దకడుబూరులో బుధువారం నిర్వహించిన "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన కర్నూలు జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు కు కురువ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ వినతి పత్రంలో మాదాసి-మదారి కురువ హక్కులకై నేటికి పోరాటం జరుగుతుందని ఈ విషయంపై పార్లమెంట్ లో చర్చ జరిపి కురవలను మాదాసి-మదారి కురువలుగా గుర్తించాలని తెలిపారు. ఈ కులానికి సంబంచిన సర్టిఫికెట్లు మంజూరు చేయాలనీ, చదుకునే పిల్లలకు భవిష్యత్ లో ఈ సర్టిఫికెట్లు ఎంతో ఉపయోగకరమని ఎంపీ నాగరాజు కు మాదాసి మదరి కురువ మంత్రాలయం తాలూకా ఇన్చార్జి దిద్దికాటి బీరప్ప మరియు మండల అధ్యక్షుడు గంగులపాడు రమేష్ లు తెలిపారు. వినతి పత్రం అందుకున్న అనంతరం ఎంపీ బస్తిపాటి నాగరాజు సానుకూలంగా స్పందించి కచ్చితంగా ఈ విషయంపై పార్లమెంట్ లో చర్చ జరిపి కురవల హక్కులకై గళం విప్పుతామని తెలిపారు.IMG_20240926_221944

Views: 29
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కొత్తగూడెం పోలీసుల స్పెషల్ డ్రైవ్  కొత్తగూడెం పోలీసుల స్పెషల్ డ్రైవ్ 
కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 22 :ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో డిఎస్పి ఆదినారాయణ ఆధ్వర్యంలో కొత్తగూడెం సబ్ డివిజన్  పోలీస్ అధికారులు ఆదివారం సాయంత్రం కొత్తగూడెం పోస్ట్...
గంజాయి రహిత గ్రామంగా వెలికట్టను తీర్చిదిద్దుదాం
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు..
ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్