మానవత్వంతో మండల వైసీపీ నేతలు ముందడుగు...!

- బాధిత కుటుంబానికి 50వేలు ఆర్థిక సహాయంతో చేయూత.

On
మానవత్వంతో మండల వైసీపీ నేతలు ముందడుగు...!

- బాధిత కుటుంబానికి వైసీపీ నేతలు నిత్యవసర సరుకులు పంపిణి.

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 26 :- మంత్రాలయం నియోజకవర్గంలోని మండల కేంద్రమైన పెద్దకడుబూరులో బుధువారం సాయంత్రం వేళలో స్థానిక ఎస్సి కాలనిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంచోది శాంతిరాజు యొక్క ఇంటిలో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. సుమారు 5లక్షల వరకు ఆస్థి నష్టం జరిగింది. గురువారం ఈ విషయం తెలిసుకున్న వెంటనే వైసీపీ యువనేత వై. ప్రదీప్ రెడ్డి 25వేలు మరియు పెద్దకడుబూరు వైసీపీ పార్టీ నేతలు మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, మాజీ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్.రామలింగారెడ్డి, ఆర్.రవిచంద్రా రెడ్డి, ఆర్. శివరామి రెడ్డి, సర్పంచ్ రామాంజినేయులు మరియు వార్డు మెంబెర్ బ్రమ్మయ్య ఆచారి అందరూ 25వేలు కలిపి మొత్తం 50,000/-రూపాయలను అగ్నిప్రమాదం జరిగిన మంచోది శాంతిరాజు అనే బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంతో చేయూతనిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులెవ్వరు అధర్యపడొద్దు అండగా అండగా ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి, ప్రదీప్ రెడ్డితో పాటు మేమంతా ఉన్నాం అని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో జరిగిన నష్టానికి ప్రభుత్వం నుండి అందాల్సిన నష్టపరిహారం మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందేలా చూడాలని అధికారులను కోరారు. అనంతరం ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు...ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముక్కరన్న, అర్లప్ప, సుందరం, ప్రసాద్, రాజు మరియు వైసీపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20240926-WA0214

Views: 104
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

సింగరేణిలో వ్రాత పరీక్షలు సింగరేణిలో వ్రాత పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత...
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..