నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివస్
On
ఖమ్మం నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి భూక్య ప్రవీణ్ సింగ్ గారి ఆదేశాల మేరకు అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కమర్తపు భానుచందర్ గారి సహకారంతో కెసిఆర్ నగర్ యూత్ క్లబ్, వారు భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూనిటీ డే కార్యక్రమమును నిర్వహించడం జరిగింది. యూనిటీ డే లో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటానికి ముందుగా పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తరువాత యువతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క గొప్పతనము గురించి అవగాహన ఇచ్చి నినాదాలు పోటీ నిర్వహించి అనంతరం ర్యాలీ మరియు ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. నినాదాలు పోటీలో మొదటి రెండు బహుమతులను మెడల్స్ తో సత్కరించడం జరిగింది. ఇందుకు సహకరించినందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి నెహ్రు యువ కేంద్ర తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
Views: 43
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Mar 2026 20:12:24
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...

Comment List