పోటాపోటీగా కొనసాగుతున్న క్రికెట్ పోటీలు

మొదటి మ్యాచ్ ఉపాధ్యాయుల విజయం

On
పోటాపోటీగా కొనసాగుతున్న క్రికెట్ పోటీలు

రెండో మ్యాచ్ చాతకొండ బెటాలియన్-6 విజయం

IMG20241109094407కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్ నవంబర్ 9: డాక్టర్ బి.ఎస్.రావు క్రికెట్ టోర్నమెంట్ రెండో రోజు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో పోటా పోటీగా క్రికెట్ మ్యాచ్ లు కొనసాగాయి. మొదటి మ్యాచ్ మీడియా-2 జట్టు మరియు ఉపాధ్యాయుల జట్టు మధ్య మ్యాచ్ కొనసాగింది. మీడియా-2 జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 109/7 పరుగులు సాధించి ,110 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉపాధ్యాయుల జట్టు ముందు ఉంచింది. ఉపాధ్యాయల జట్టు 113/3 పరుగులు సాధించి సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంది. మీడియా-2 జట్టు నుంచి హనుమ (35), దశరథ్ (31) పరుగులు సాధించారు. ఉపాధ్యాయ జట్టు నుంచి రామకృష్ణ (45), శోభన్(43) పరుగులు సాధించి జట్టుకు విజయని అందించారు. అనంతరం రెండో మ్యాచ్లో చాతకొండ బెటాలియన్-6 జట్టు మరియు ఉపాధ్యాయుల జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బెటాలియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 164/6 పరుగులు సాధించింది.165 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉపాధ్యాయల జట్టు ముందు ఉంచింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఉపాధ్యాయల జట్టు158/4 పరుగులతో నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేసి అనవసరమైన పరుగుల కోసం ప్రయత్నం చేసి, 7 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. బెటాలియన్ జట్టు తరఫున రామ్ బ్రహ్మం( కెప్టెన్)-50,గణేష్ (40) పరుగులు సాధించి బెటాలియన్ జట్టుకు మంచి స్కోర్ను అందించారు. ఉపాధ్యాయల జట్టు నుంచి రామకృష్ణ (53), నరేష్ (31) పరుగులు సాధించి మంచి తోడ్పాటునందించిన గాని ఓటమి చవిచూసింది.

 

Read More బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..

 

 

Views: 23
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్