డాక్టర్ బి ఎస్ రావు క్రికెట్ పోటీలో సెమిస్కు చేరుకున్న నాలుగు జట్లు

మొదటి సెమీస్ లో పోలీస్ జట్టు విజయం

On
డాక్టర్ బి ఎస్ రావు క్రికెట్ పోటీలో సెమిస్కు చేరుకున్న నాలుగు జట్లు

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా వినయ్ కుమార్

కొత్తగూడెం నవంబర్12: ఐదు రోజులుగా డాక్టర్ బి.ఎస్.రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా విఐపి డిపార్ట్మెంటల్  క్రికెట్ టోర్నమెంట్ లో 12 జట్లు పాల్గొని , 8 జట్లు నిష్క్రమించి, 4 జట్లు సెమీ ఫైనల్లోకి ప్రవేశించాయి. మొదటి సెమీ ఫైనల్ గా పోలీసు జట్టు మరియు బెటాలియన్ -6 జట్ల మధ్య పోటీ మంగళవారం నిర్వహించారు. తొలుత టాస్ గెలిచిన పోలీసు జట్టు బ్యాటింగ్ ఎంచుకొని, నిర్ణీత 20 ఓవర్లలో 167/8 పరుగులు చేసి,168 పరుగుల విజయ లక్ష్యాన్ని బెటాలియన్-6 జట్టు ముందు ఉంచింది.అనంతరం బ్యాటింగ్ చేసిన బెటాలియన్-6 జట్టు 18 ఓవర్లలో 116/10 పరుగులు చేసి ఓటమి చెందింది . ఈ మొదటి సెమీ ఫైనల్ లో పోIMG20241112151407లీసు జట్టు విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. పోలీసు జట్టు నుండి బాల(47),జి.రాజు(35),సురేష్(23)అత్యధిక పరుగులు చేశారు. బెటాలియన్ జట్టు నుంచి చలపతి (28), రాంబాబు (21) అత్యధిక పరుగులు అందించారు. పోలీసు జట్టు నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన వినయ్ కుమార్ కు ఆర్ఐ సుధాకర్, ఎస్ఐ నరేష్ ,ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోచ్ సన్నీ శోబస్, చేతుల మీదుగా అవార్డును అందించారు. వ్యాఖ్యతగా జాన్సన్ డేవిడ్(బాబు), సాంసన్,ఆర్గనైజర్ మడికంటి నవీన్,ఎంపైర్లుగా సన్నీ శోబస్,కిరణ్ వ్యవహరించారు

Views: 80
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

స్థానిక యుద్దానికి మేం సిద్ధం  స్థానిక యుద్దానికి మేం సిద్ధం 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 27:జిల్లాలో బహుజనుల రాజ్యాధికార సాధనగా భవిష్యత్తు పోరాట లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి
మేడారం జాతరకు బస్సులు
తొర్రూరులో డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
తొర్రూర్ లో డబల్ బెడ్రూంలో పరిశీలన, పలు వార్డులలో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన మంత్రి
డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన,ద లో అభివృద్ధి పనుల శంకుస్థాపన