డాక్టర్ బి ఎస్ రావు క్రికెట్ పోటీలో సెమిస్కు చేరుకున్న నాలుగు జట్లు

మొదటి సెమీస్ లో పోలీస్ జట్టు విజయం

On
డాక్టర్ బి ఎస్ రావు క్రికెట్ పోటీలో సెమిస్కు చేరుకున్న నాలుగు జట్లు

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా వినయ్ కుమార్

కొత్తగూడెం నవంబర్12: ఐదు రోజులుగా డాక్టర్ బి.ఎస్.రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా విఐపి డిపార్ట్మెంటల్  క్రికెట్ టోర్నమెంట్ లో 12 జట్లు పాల్గొని , 8 జట్లు నిష్క్రమించి, 4 జట్లు సెమీ ఫైనల్లోకి ప్రవేశించాయి. మొదటి సెమీ ఫైనల్ గా పోలీసు జట్టు మరియు బెటాలియన్ -6 జట్ల మధ్య పోటీ మంగళవారం నిర్వహించారు. తొలుత టాస్ గెలిచిన పోలీసు జట్టు బ్యాటింగ్ ఎంచుకొని, నిర్ణీత 20 ఓవర్లలో 167/8 పరుగులు చేసి,168 పరుగుల విజయ లక్ష్యాన్ని బెటాలియన్-6 జట్టు ముందు ఉంచింది.అనంతరం బ్యాటింగ్ చేసిన బెటాలియన్-6 జట్టు 18 ఓవర్లలో 116/10 పరుగులు చేసి ఓటమి చెందింది . ఈ మొదటి సెమీ ఫైనల్ లో పోIMG20241112151407లీసు జట్టు విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. పోలీసు జట్టు నుండి బాల(47),జి.రాజు(35),సురేష్(23)అత్యధిక పరుగులు చేశారు. బెటాలియన్ జట్టు నుంచి చలపతి (28), రాంబాబు (21) అత్యధిక పరుగులు అందించారు. పోలీసు జట్టు నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన వినయ్ కుమార్ కు ఆర్ఐ సుధాకర్, ఎస్ఐ నరేష్ ,ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోచ్ సన్నీ శోబస్, చేతుల మీదుగా అవార్డును అందించారు. వ్యాఖ్యతగా జాన్సన్ డేవిడ్(బాబు), సాంసన్,ఆర్గనైజర్ మడికంటి నవీన్,ఎంపైర్లుగా సన్నీ శోబస్,కిరణ్ వ్యవహరించారు

Views: 99
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్  డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
భద్రాద్రి కొత్తగూడెం,(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూలై 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ (డీఎఫ్ఓ) అధికారిగా సిద్ధార్థ విక్రమ్ సింగ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా...
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి
తొర్రూరులో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన
సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు
వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరు? విడాకుల తర్వాత కెరీర్ ఎందుకు క్షీణించింది? నిజాలు, ప్రచారాల పూర్తి విశ్లేషణ
భారతదేశంలోని 5 అత్యంత మిస్టరీ ప్రదేశాలు.. శాస్త్రవేత్తలకూ పూర్తి సమాధానం దొరకని రహస్యాలు!
అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం.. తవ్వితే అంతా బంగారమేనా? 2300 ఏళ్ల చరిత్రలో దాగిన నిజాలు!