డాక్టర్ బి ఎస్ రావు క్రికెట్ పోటీలో సెమిస్కు చేరుకున్న నాలుగు జట్లు

మొదటి సెమీస్ లో పోలీస్ జట్టు విజయం

On
డాక్టర్ బి ఎస్ రావు క్రికెట్ పోటీలో సెమిస్కు చేరుకున్న నాలుగు జట్లు

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా వినయ్ కుమార్

కొత్తగూడెం నవంబర్12: ఐదు రోజులుగా డాక్టర్ బి.ఎస్.రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా విఐపి డిపార్ట్మెంటల్  క్రికెట్ టోర్నమెంట్ లో 12 జట్లు పాల్గొని , 8 జట్లు నిష్క్రమించి, 4 జట్లు సెమీ ఫైనల్లోకి ప్రవేశించాయి. మొదటి సెమీ ఫైనల్ గా పోలీసు జట్టు మరియు బెటాలియన్ -6 జట్ల మధ్య పోటీ మంగళవారం నిర్వహించారు. తొలుత టాస్ గెలిచిన పోలీసు జట్టు బ్యాటింగ్ ఎంచుకొని, నిర్ణీత 20 ఓవర్లలో 167/8 పరుగులు చేసి,168 పరుగుల విజయ లక్ష్యాన్ని బెటాలియన్-6 జట్టు ముందు ఉంచింది.అనంతరం బ్యాటింగ్ చేసిన బెటాలియన్-6 జట్టు 18 ఓవర్లలో 116/10 పరుగులు చేసి ఓటమి చెందింది . ఈ మొదటి సెమీ ఫైనల్ లో పోIMG20241112151407లీసు జట్టు విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. పోలీసు జట్టు నుండి బాల(47),జి.రాజు(35),సురేష్(23)అత్యధిక పరుగులు చేశారు. బెటాలియన్ జట్టు నుంచి చలపతి (28), రాంబాబు (21) అత్యధిక పరుగులు అందించారు. పోలీసు జట్టు నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన వినయ్ కుమార్ కు ఆర్ఐ సుధాకర్, ఎస్ఐ నరేష్ ,ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోచ్ సన్నీ శోబస్, చేతుల మీదుగా అవార్డును అందించారు. వ్యాఖ్యతగా జాన్సన్ డేవిడ్(బాబు), సాంసన్,ఆర్గనైజర్ మడికంటి నవీన్,ఎంపైర్లుగా సన్నీ శోబస్,కిరణ్ వ్యవహరించారు

Views: 80
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్ ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం