డాక్టర్ బి ఎస్ రావు క్రికెట్ పోటీలో సెమిస్కు చేరుకున్న నాలుగు జట్లు

మొదటి సెమీస్ లో పోలీస్ జట్టు విజయం

On
డాక్టర్ బి ఎస్ రావు క్రికెట్ పోటీలో సెమిస్కు చేరుకున్న నాలుగు జట్లు

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా వినయ్ కుమార్

కొత్తగూడెం నవంబర్12: ఐదు రోజులుగా డాక్టర్ బి.ఎస్.రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా విఐపి డిపార్ట్మెంటల్  క్రికెట్ టోర్నమెంట్ లో 12 జట్లు పాల్గొని , 8 జట్లు నిష్క్రమించి, 4 జట్లు సెమీ ఫైనల్లోకి ప్రవేశించాయి. మొదటి సెమీ ఫైనల్ గా పోలీసు జట్టు మరియు బెటాలియన్ -6 జట్ల మధ్య పోటీ మంగళవారం నిర్వహించారు. తొలుత టాస్ గెలిచిన పోలీసు జట్టు బ్యాటింగ్ ఎంచుకొని, నిర్ణీత 20 ఓవర్లలో 167/8 పరుగులు చేసి,168 పరుగుల విజయ లక్ష్యాన్ని బెటాలియన్-6 జట్టు ముందు ఉంచింది.అనంతరం బ్యాటింగ్ చేసిన బెటాలియన్-6 జట్టు 18 ఓవర్లలో 116/10 పరుగులు చేసి ఓటమి చెందింది . ఈ మొదటి సెమీ ఫైనల్ లో పోIMG20241112151407లీసు జట్టు విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. పోలీసు జట్టు నుండి బాల(47),జి.రాజు(35),సురేష్(23)అత్యధిక పరుగులు చేశారు. బెటాలియన్ జట్టు నుంచి చలపతి (28), రాంబాబు (21) అత్యధిక పరుగులు అందించారు. పోలీసు జట్టు నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన వినయ్ కుమార్ కు ఆర్ఐ సుధాకర్, ఎస్ఐ నరేష్ ,ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోచ్ సన్నీ శోబస్, చేతుల మీదుగా అవార్డును అందించారు. వ్యాఖ్యతగా జాన్సన్ డేవిడ్(బాబు), సాంసన్,ఆర్గనైజర్ మడికంటి నవీన్,ఎంపైర్లుగా సన్నీ శోబస్,కిరణ్ వ్యవహరించారు

Views: 79
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..