ఎల్లమ్మ గడ్డ నూతన గ్రామపంచాయతీ కోసం

పోస్టులో వినతిపత్రం పంపిన

On
ఎల్లమ్మ గడ్డ నూతన గ్రామపంచాయతీ కోసం

తండా గిరిజనులు

గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు అనసూయ ( సీతక్క ) లకి నమస్కరించి రాయునది...

ఈరోజు పోస్ట్ ఆఫీస్ ద్వారా తమ సమస్యలను తెలపడం జరిగింది.

విషయం:- ఎల్లమ్మ గడ్డ తండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయుట కొరకు లేదా గ్రామపంచాయతీగా గుర్తించని యెడల బొమ్మెర గ్రామపంచాయతీలో యధావిధిగా ఉంచుట గురించి విన్నపం. 

        అయ్యా  
 పై విషానుసారముగా తమరితో మనవి చేయునది ఏమనగా బొమ్మెర గ్రామ శివారులోని ఎల్లమ్మ గడ్డ తండా, బాబు నగర్ తండా కలదు. పూర్వం నుండి ఎల్లమ్మ గడ్డ తండా, బాబు నగర్ తండా ఓటర్లు బమ్మెర గ్రామంలో ఉండేది. అలాగే రెవెన్యూ గ్రామపంచాయతీ కూడా బొమ్మెరలో ఉండేది. కానీ 2018 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీగా చేస్తామని చెప్పింది. ఎల్లమ్మ గడ్డ తండను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయుటకు మొదటి ప్రతిపాదన చేశారు. కానీ చివరి ఈ ప్రతిపాదనలు ఎల్లమ్మ గడ్డ తండాకు మొండి చేయి చూపించారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి గత 2018 సంవత్సరంలో వరకు తమ తండాలను సమీప గ్రామమైన బమ్మెర గ్రామపంచాయతీలో ఉండాలి. మా తండాను 2018 సంవత్సరంలో మండలంలోని వేరే గ్రామమైన  అయ్యంగార్ పల్లిలో విలీనం చేసి అన్యాయం చేశారు. బమ్మెరలో మాకు భౌగోళికంగా ఉన్న అవినాభావ సంబంధాలు కొత్త పంచాయతీ రాజ్ చట్టం తో విభజించడం వల్ల  మా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారిందని ఆందోళనచేస్తున్నాము. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రామ పంచాయతీలో మానసికంగా, భౌగోళికంగా, అభివృద్ధి పరంగా ఈమడలేక పోతున్నాము. సంబంధాలు లేని గ్రామపంచాయతీలో కలుపడం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నాము. గ్రామపంచాయతీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లు ఒక ఒక గ్రామంలో ఎంపిటిసి ఎలక్షన్ వచ్చినప్పుడు మరొక గ్రామంలో ఓట్లు వేయడం అనేక ఇబ్బందులకు గురవుతున్నాము.                 
మా మీద దయ తలచి మా తండా ఓటర్లను మా పాత గ్రామపంచాయతీలో బమ్మెరలో ఉంచాలని మా తండా వాసుల ప్రార్ధన. 
ఈ కార్యక్రమంలో బానోత్ రమేష్, బొజ్జ, బిక్కు, రవి, చిన్న రమేష్, నరేష్, బిచ్చం, నునావత్ సురేష్, నెహ్రు, శ్రీను, చిరంజీవి, యాకు, రవి పాల్గొన్నారు.IMG_20241129_192105

Read More తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో కొత్త స్పెషల్ ట్రైన్స్.. ప్రయాణం మరింత సులభం!

Views: 25
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి.. మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..
మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, జులై 26, న్యూస్ ఇండియా ప్రతినిధి: రానున్న వినాయక చవితి...
పటాన్ చెరు రియల్ ఎస్టేట్‌లో ఊహించని మార్పులు.. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పెట్టుబడికి ఇదే సరైన సమయమా?
రోజుకు కేవలం ₹67 పెట్టుబడి.. భవిష్యత్తులో ₹1 కోటి సంపద సాధ్యమేనా? SIP సీక్రెట్ ఇదే!
హైదరాబాద్ టు అమరావతి జెట్ స్పీడ్!.. RRR, 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కీలక ముందడుగు
గోపీచంద్ అన్న ప్రేమ్‌చంద్ ఎలా చనిపోయాడు? కేవలం 19 ఏళ్లకే ముగిసిన జీవిత కథ
పాకిస్తాన్‌కు డెడ్‌లైన్?.. POKలో ప్రజా నిరసనలు ఉధృతి.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?
IRCTC ఒడిశా టూర్ ప్యాకేజీ.. 4 రాత్రులు, 5 రోజుల్లో పూరీ, కోణార్క్, భువనేశ్వర్ దర్శనం.. టికెట్ ధర ఎంత?