ఫోర్జరీ సంతకాలతో కార్మికులను మోసం చేసిన ఐఎన్టియుసి

అధికారి సంతకం, సింగరేణి ముద్ర లేని ఆథరైజేషన్ లేఖలను ఎలా అనుమతించారు..?

On
ఫోర్జరీ సంతకాలతో కార్మికులను మోసం చేసిన ఐఎన్టియుసి

వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యదర్శి వంగా వెంకట్

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్ ) డిసెంబర్ 3:ఫోర్జరీ సంతకాలతో సభ్యత్వ అంగీకార పత్రాలు సమర్పించి ఐఎన్టియుసి సంఘం ఆర్ధికదోపిడిని ప్రారంభించిందని, దీనిపై సింగరేణి యాజమాన్యం స్పందించి తక్షణమే రికవరీకి నిలుపుదల చేసి కార్మికులకు న్యాయం చేయాలనీ సింగరేణి గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్రకమిటీ కార్యదర్శి వంగా వెంకట్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ కార్యాలయం

IMG-20241203-WA1399శేషగిరిభవన్లో  మంగళవారం వారు మాట్లాడుతూ గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు కార్మికుడి అనుమతితో ఆథరైజేషన్ లెటర్ ద్వారా ప్రతినెలా వేతనంనుంచి రికవరీ చేసి సంఘాల ఖాతాలో జమచేయాల్సి ఉంటుందని, ఇందుకు విరుద్దంగా ఐఎన్టియుసి సంఘం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ముద్రించిన ఆథరైజెషన్ లేటర్లలు యాజమాన్యానికి సమర్పిస్తే సింగరేణి యాజమాన్యం ముద్ర, పర్సనల్ జనరల్ మేనేజర్ సంతకంచేసిన అనంతరం యూనియన్లకు అందించిన తర్వాత కార్మికనుంచి సంతకం తీసుకొని యాజమాన్యానికి సమర్పించాల్సి ఉంటుందని, ఆ లేఖల ద్వారా నెలకు ఆ కార్మికుల నుంచి రూ.యాభై చొప్పున రికవరీ చేసి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుందన్నారు. దీనికి భిన్నంగా అధికారుల సంతకం, సింగరేణి యాజమాన్యం ముద్ర లేకుండానే ముందస్తుగా కార్మికుల సంతకాలతో సమర్పిస్తే రెండు నెలలకు సంబంధించి సభ్యత్వం రికవరీ చేశారని ఇది సరైంది కాదన్నారు. ఫోర్జరీ సంతకాలు, అధికారి సంతకం, సింగరేణి స్టాంపు లేకుండా రికవరీ చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, దీనిపై విచారణ జరిపి నష్టపోయిన కార్మికులకు న్యాయం చేయాలనీ, రికవరీ చేసిన సొమ్మును తిరిగి కార్మికుల ఖాతాలలో జమచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కేంద్ర కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి జి వీరాస్వామి, కొత్తగూడెం, కార్పొరేట్ బ్రాంచిల కార్యదర్శులు వట్టికొండ మల్లికార్జున్ రావు, రమణమూర్తి, నాయకులూ కె రాములు, సందెబోయిన శ్రీనివాస్, గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Views: 67
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..